Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్కడ రూ.500లకే ఎల్‌ఈడీ టీవీ..! అసలు విషయం తెలిస్తే షాకవుతారు

Webdunia
మంగళవారం, 2 మార్చి 2021 (10:29 IST)
ఏపీలోని కృష్ణా జిల్లా విజయవాడ రూరల్‌ మండలం ఎనికేపాడులో సోనోవిజన్ షో రూమ్‌ ఉంది. అక్కడి నుంచి భీమవరానికి ఎల్‌ఈడీ టీవీలు, రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, వాషింగ్‌ మెషన్లు ఓ మినీ వ్యాన్‌లో లోడ్‌ చేశారు.

అయితే ఈ వ్యాన్‌పై యూపీకి చెందిన ఓ దొంగల ముఠా కన్నేసింది. ఇంకేముంది వెంటనే చాకచక్యంగా చోరీ చేసేశారు. వ్యాన్‌ను ఎవరికి అనుమానం రాకుండా ఎనికేపాడు నుంచి విజయవాడ మీదుగా హైదరాబాద్‌ వెళ్లిపోవాలని మాస్టర్‌ ప్లాన్‌ వేశారు.

అయితే మార్గమధ్యలో కథ అడ్డం తిరిగింది. వ్యాన్‌లో డీజిల్‌ అయిపోయింది. చేతిలో డబ్బులు లేవు. వ్యాన్‌లో చూస్తే లక్షలాది రూపాయల ఎలక్ట్రానిక్‌ వస్తువులు ఉన్నాయి.

దీంతో చేసేదేమి లేక డీజిల్‌ డబ్బుల కోసం ఎల్‌ఈడీ టీవీనీ రూ.500లకు బేరం పెట్టారు. ఇలా బేరం పెట్టడంతో స్థానికులకు అనుమానం వచ్చింది. ఇంకేముంది ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం, అందించారు.

దీంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చి వారిని పట్టుకున్నారు. చోరీ చేసిన ఎలక్ట్రానిక్‌ వస్తువుల విలువ రూ.9 లక్షల వరకు ఉంటుంది. వాటిని స్వాధీనం చేసుకుని.. దొంగల ముఠా సమాచారం మేరకు సదరు సోనోవిజన్‌ యజమాన్యానికి సమాచారం అందించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Singh: వివాదంలో పవన్ సింగ్.. హీరోయిన్ అంజలి నడుమును తాకాడు (video)

Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ పుట్టినరోజు పోస్టర్‌ విడుదల

Monalisa: మలయాళ సినిమాలో నటించనున్న కుంభమేళా మోనాలిసా

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం. నటించిన మిత్ర మండలి దీపావళికి రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments