Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకాపాకు మాజీ మంత్రి బాలినేని దూరం దూరం...

Webdunia
ఆదివారం, 7 మే 2023 (09:39 IST)
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి బాగా దూరమైపోయినట్టు తెలుస్తుంది. తాజాగా ఒంగోలులో ఆయన పేరుతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో పార్టీ అధ్యక్షుడు, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి, మంత్రి ఆదిమూలపు సురేష్ ఫోటోలు లేకపోవడం ఇపుడు రాజకీయ వర్గాల్లో పెను చర్చకు దారితీశాయి. ఇటీవల వైకాపా కో ఆర్డినేటర్ పదివి నుంచి తప్పుకున్న బాలినేని.. ఇటీవల ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో తనపై పార్టీలోని వారే విమర్శలు చేస్తున్నారంటూ కంటతడి పెట్టుకున్న విషయం తెల్సిదే. ఇపుడు జగన్ ఫ్లెక్సీలో పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పేరు కనిపించకపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 
 
వేసవి నేపథ్యంలో ఒంగోలు నగరపాలక కార్యాలయం, ప్రకాశం భవన్, మార్కెట్ సెంటర్, రిమ్స్ వద్ద చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. బాలినేని శ్రీనివాస రెడ్డి వీటిని ప్రారంభించాల్సివుంది. కానీ, వివిధ కారణాలతో ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం వాయిదాపడింది. అయితే, ఆయా చలివేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్లీల్లో ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి, మంత్రి ఆదిమూలపు సురేష్ ఫోటోలు లేకపోవడంతో రాజకీయ చర్చకు తెరలేసింది. ఈ పరిణామాలన్నింటినీ చూస్తే పార్టీతో ఆయనకు దూరం పెరిగినట్టుగా ఉందని చెబుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా అమ్మ శ్రీదేవి కూడా మలయాళీ కాదు : విమర్శకులకు జాన్వీ కౌంటర్

ఐదు పదుల వయసులో శిల్పాశెట్టి ఫిట్నెస్ సీక్రెట్ ఇదే!

ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో సీజన్ 3లో పేటీఎం సీఈఓ విజయ్ శేఖర్ శర్మ, తన డబ్బునంతా కపిల్ శర్మకు అప్పగించారా?

Natti kumar: ఫిలిం ఛాంబర్, ఫెడరేషన్ కలిసి సినీ కార్మికులను మోసం చేశారు : నట్టి కుమార్ ఫైర్

Govinda-Sunita divorce: గోవింద- సునీత విడాకులు తీసుకోలేదు.. మేనేజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తర్వాతి కథనం
Show comments