Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనాను అడ్డుపెట్టుకుని వైసీపీ నేతల అక్రమాలు: యనమల

Webdunia
గురువారం, 2 ఏప్రియల్ 2020 (11:04 IST)
‘కరోనా’ను అడ్డుపెట్టుకుని వైసీపీ నేతలు అక్రమాలకు  పాల్పడుతున్నారని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. ఏపీ సీఎం జగన్ పై ఆయన విమర్శలు గుప్పించారు.

కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచమంతా వణికిపోతుంటే, జగన్ మాత్రం భయపడాల్సిన పనిలేదని మీడియా సమావేశంలో చెప్పడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. ప్రజల ఆరోగ్యంపై జగన్ కు ఎంత శ్రద్ధ ఉందన్న విషయం ఆయన చేసిన వ్యాఖ్యలే నిదర్శనమని ఎద్దేవా చేశారు.

ఏదో మొక్కుబడిగా మీడియా సమావేశం నిర్వహించారని, రాష్ట్ర ఆదాయం మందగిస్తోందని చెప్పిన జగన్, దీని నుంచి బయటపడేందుకు ఏ విధమైన చర్యలు చేపట్టబోతున్నారో చెప్పలేదని, ఈ విషయంలో నిపుణుల సలహాలు కూడా జగన్ తీసుకోలేదని విమర్శించారు.

మీడియా సమావేశంలో ప్రశ్నలు అడిగే అవకాశం కూడా విలేకరులకు జగన్ ఇవ్వలేదని, ‘కరోనా’ను అడ్డుపెట్టుకుని వైసీపీ నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments