Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యాపిల్లల్నిహత్య చేసీ... విశాఖలో ఘోరం

Webdunia
సోమవారం, 23 సెప్టెంబరు 2019 (06:27 IST)
కట్టుకున్న భార్యను, ఏడాదిన్నర వయసున్న కూతురిని హత్య చేసి తర్వాత తాను కూడా సూసైడ్ చేసుకున్నాడో వ్యక్తి. విశాఖలో జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది.

ఒడిశాకు చెందిన సుజిత్ బన్స్‌దేవ్.. ఈనెల 19న భార్యాపిల్లల్ని చంపేశాడు. తర్వాత అపార్ట్‌మెంట్ నుంచి వెళ్లిపోయాడు. తల్లికి ఫోన్ చేసి తాను చేసిన ఘోరాన్ని చెప్పి మృతదేహాలను తీసుకెళ్లాలని కోరాడు. తాను కూడా సూసైడ్ చేసుకుంటున్నట్టు చెప్పాడు. తర్వాత రూర్కెలా వెళ్లి అక్కడ రైలు కింద పడి చనిపోయాడు.
 
సుజిత్ బన్స్‌దేవ్ భార్య సుక్ల సమంతతో కలిసి విశాఖలోని బింద్రానగర్‌లో నాలుగేళ్లుగా ఉంటున్నాడు. ఉన్నట్టుండి ఏమైందో కానీ భార్యను, కూతురిని దారుణంగా చంపేశాడు. తన తల్లికి మర్డర్ చేసిన విషయం చెప్పడంతో.. వారు భువనేశ్వర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు.

అక్కడి నుంచి పీఎస్‌ పాలెం పోలీసులకు ఫోన్ చేసి చెప్పారు. దీంతో.. శనివారం సుక్రజిత్ ఇంటికి వెళ్లిన స్థానిక పోలీసులు తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లారు. అక్కడున్న రెండు మృతదేహాల్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు.

భువనేశ్వర్ నుంచి వచ్చిన మృతురాలి తల్లిదండ్రులు సుక్రజిత్ చేసిన ఘోరం చూసి కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments