కర్నూలులో హైకోర్టు ఏర్పాటు రాష్ట్ర ప్రభుత్వమే చూడాలి

Webdunia
గురువారం, 21 నవంబరు 2019 (08:42 IST)
లోక్ సభలో బుధవారం నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి కర్నూలులో హైకోర్టు ఏర్పాటు గురించి ప్రశ్నించారు. గత 50 రోజులుగా కర్నూలు బార్ అసోసియేషన్ కు చెందిన న్యాయవాదులు అక్కడ హైకోర్టు ఏర్పాటు చేయాలని ఉద్యమిస్తున్న విషయాన్ని కేంద్ర న్యాయ వ్యవహారాల శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ కు  తెలిపారు.

వారి ఆకాంక్షల మేరకు కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేసి ఎలాంటి వివాదాలకు తావు లేకుండా చూడాలని కోరారు. దానికి కేంద్ర న్యాయశాఖ న్యాయ వ్యవహారాల శాఖ మంత్రి  రవిశంకర్ ప్రసాద్ లిఖిత పూర్వకంగా  జవాబిస్తూ ప్రతి రాష్ట్రానికి హైకోర్టు ఏర్పాటు చేయాలని రాజ్యాంగం ప్రతిపాదిస్తోందని తెలిపారు.

ఈ మేరకు రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ లోని అమరావతిలో  2019 జనవరి 1న హైకోర్టు ఏర్పాటు అయిందని తెలిపారు. అలాగే తెలంగాణకు సంబంధించి హైకోర్టు హైదరాబాద్ లో ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. హైకోర్టు ఏర్పాటు నిర్వహణ అనేది రాష్ట్ర ప్రభుత్వ అధికార పరిధిలో ఉందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venky 77: వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో మల్లీశ్వరీ సీక్వెల్ !

Janhvi : రామ్ చరణ్, జాన్వీ కపూర్ పై పెద్ది కోసం పూణేలో సాంగ్ షూటింగ్

నాలుగు జన్మల కథతో మైథలాజికల్ చిత్రంగా గత వైభవ: ఎస్ఎస్ దుశ్యంత్

బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టికి షాకిచ్చిన బాంబే హైకోర్టు

KRamp: ఫ్లవర్ లాంటి లవర్ ఉంటే లైఫ్ సూపర్ రా అంటూ K-ర్యాంప్ గీతం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దీపావళి డ్రెస్సింగ్, డెకర్: ఫ్యాబ్ఇండియా స్వర్నిమ్ 2025 కలెక్షన్‌

ధ్యానంతో అద్భుతమైన ప్రయోజనాలు

రష్మిక మందన్న, ప్రముఖ క్రియేటర్‌లతో జతకట్టిన క్రాక్స్

గ్యాస్ట్రిక్ సమస్యలు వున్నవారు ఎలాంటి పదార్థాలు తీసుకోకూడదు?

బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments