Webdunia - Bharat's app for daily news and videos

Install App

12 నెలలకు సీఆర్టీ టీచర్ల సేవలు, సెలవు కాలంలోనూ అందనున్న వేతనాలు

Webdunia
మంగళవారం, 23 మార్చి 2021 (18:16 IST)
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గిరిజన సంక్షేమశాఖ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు రెసిడెన్షియల్ టీచర్ల (సీఆర్టీల) పని కాలాన్ని ఈ విద్యాసంవత్సరానికి 12 నెలల పాటు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసినట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి వెల్లడించారు.
 
గిరిజన విద్యాసంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు రెసిడెన్షియల్ టీచర్ (సీఆర్టీ) లకు ఇప్పటివరకు వారు పనిచేస్తున్న కాలానికి మాత్రమే వారి సేవలను పరిగణలోకి తీసుకుంటూ ఆమేరకే  వేతనాలను కూడా చెల్లించడం జరుగుతోందని పుష్ప శ్రీవాణి మంగళవారం మీడియాకు విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. విద్యాసంస్థలకు చివరి పనిదినమైన ఏప్రిల్ 23 వ తేదివరకు మాత్రమే సీఆర్టీల పనిదినాలను పరిగణలోకి తీసుకోవడం జరిగేదని చెప్పారు.
 
ఈ కారణంగా ఏప్రిల్ 23 నుంచి మళ్లీ విద్యా సంస్థలు పున: ప్రారంభమయ్యే జూన్ 12 దాకా వారికి వేతనాలను ఇచ్చేవారు కాదని తెలిపారు. అయితే తమకు సెలవు కాలంలోనూ వేతనాలివ్వాలని, ఏడాదిలో 10 రోజులుమినహా మిగిలిన 12 నెలల కాలాన్ని కూడా తమ పని దినాలుగా గుర్తించాలని సీఆర్టీలు చేసిన విన్నపాన్ని దృష్టిలో ఉంచుకొని 2020-21 విద్యా సంవత్సరానికి గాను పది రోజులు మినహా మిగిలిన మొత్తం 12 నెలల కాలాన్ని కూడా వారికి పని దినాలుగానే పరిగణిస్తూ మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసిందని పుష్ప శ్రీవాణి వివరించారు.
 
ఈ మేరకు వారికి సంబంధించిన వేతనాలను కూడా చెల్లించడం జరుగుతుందని తెలిపారు. కాగా తమ విన్నపాన్ని మన్నించి తమ సర్వీసు కాలాన్ని ఈ విద్యాసంవత్సరంలో పది రోజులు మినహా 12 నెలలకు పెంచుతూ ఉత్తర్వులను జారీ చేయడం పట్ల గిరిజన ఆశ్రమ పాఠశాలల సీఆర్టీల సంఘం నేతలు హర్షం వ్యక్తం చేసారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణికి ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments