అబ్బే... ఆ డిక్లరేషన్ మినహాయింపు జగన్ కు మాత్రమే: మంత్రి పెద్దిరెడ్డి

Webdunia
ఆదివారం, 20 సెప్టెంబరు 2020 (15:41 IST)
తిరుమలలో డిక్లరేషన్ మినహాయింపు ముఖ్యమంత్రి జగన్ కు మాత్రమేనని మంత్రి పెద్దిరెడ్డి పేర్కొన్నారు. శ్రీవారి దర్శనానికి వచ్చే అన్యమతస్థులు డిక్లరేషన్‌ సమర్పించాల్సిన అవసరం లేదన్న టిటిడి ఛైర్మన్‌ వైవి సుబ్బారెడ్డి వ్యాఖ్యలపై దుమారం రేగిన విషయం తెలిసిందే.

ఈ వ్యాఖ్యలపై మాజీ సిఎం చంద్రబాబు మాట్లాడుతూ.. డిక్లరేషన్‌ అక్కర్లేదనడం ఆధ్యాత్మిక ద్రోహమన్నారు. అనాదిగా వస్తున్న సంప్రదాయాన్ని మార్చడం సరికాదని పేర్కొన్నారు.

మంత్రి పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. గతంలో సిఎం వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి తన పాలనా కాలంలో ఎలాంటి డిక్లరేషన్‌ ఇవ్వలేదని, 5 సంవత్సరాలు స్వామి వారికి పట్టువస్త్రాలు ఇచ్చారని, ఇప్పుడు ఆయన కుమారుడు వైఎస్‌.జగన్‌ డిక్లరేషన్‌ ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పారు.

అందరూ డిక్లరేషన్‌ ఇవ్వాల్సిన అవసరం లేదని టిటిడి ఛైర్మన్‌ అనలేదని స్పష్టం చేశారు. ఆ విషయమై తనకు టిటిడి ఛైర్మన్‌ క్లారిటీ కూడా ఇచ్చారని పెద్దిరెడ్డి పేర్కొన్నారు. టిటిడి ఛైర్మన్‌ వైవి సుబ్బారెడ్డి ప్రకటనను వివాదం చేయొద్దని కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishnu : శ్రీ విష్ణు, నయన సారిక జంటగా విష్ణు విన్యాసం రాబోతుంది

Bobby Simha: బాబీ సింహా, హెబ్బా పటేల్ జంట గా చిత్రం ప్రారంభం

Jin: భూతనాల చెరువు నేపథ్యంగా జిన్ మూవీ సిద్దమైంది

నటిపై లైంగిక దాడి కేసు - నిర్దోషిగా మంజు వారియర్ మాజీ భర్త... న్యాయం జరగలేదు...

Bobby Simha: బాబీ సింహా, హెబ్బా పటేల్ కాంబినేషన్ లో చిత్రం లాంచ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి, నిమ్మకాయతో ఉప్పు.. గుండె ఆరోగ్యంతో పాటు రక్తపోటుకు చెక్

అప్పుడప్పుడు కాస్త పచ్చికొబ్బరి కూడా తింటుండాలి, ఎందుకంటే?

ఈ శీతాకాలంలో కాలిఫోర్నియా బాదంతో మీ చర్మానికి తగిన సంరక్షణను అందించండి

తులసి పొడితో హెయిర్ ప్యాక్ వేసుకుంటే.. జుట్టు నెరవదు.. తెలుసా?

Tomato Soup: శీతాకాలంలో టమోటా సూప్ తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments