Webdunia - Bharat's app for daily news and videos

Install App

అబ్బే... ఆ డిక్లరేషన్ మినహాయింపు జగన్ కు మాత్రమే: మంత్రి పెద్దిరెడ్డి

Webdunia
ఆదివారం, 20 సెప్టెంబరు 2020 (15:41 IST)
తిరుమలలో డిక్లరేషన్ మినహాయింపు ముఖ్యమంత్రి జగన్ కు మాత్రమేనని మంత్రి పెద్దిరెడ్డి పేర్కొన్నారు. శ్రీవారి దర్శనానికి వచ్చే అన్యమతస్థులు డిక్లరేషన్‌ సమర్పించాల్సిన అవసరం లేదన్న టిటిడి ఛైర్మన్‌ వైవి సుబ్బారెడ్డి వ్యాఖ్యలపై దుమారం రేగిన విషయం తెలిసిందే.

ఈ వ్యాఖ్యలపై మాజీ సిఎం చంద్రబాబు మాట్లాడుతూ.. డిక్లరేషన్‌ అక్కర్లేదనడం ఆధ్యాత్మిక ద్రోహమన్నారు. అనాదిగా వస్తున్న సంప్రదాయాన్ని మార్చడం సరికాదని పేర్కొన్నారు.

మంత్రి పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. గతంలో సిఎం వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి తన పాలనా కాలంలో ఎలాంటి డిక్లరేషన్‌ ఇవ్వలేదని, 5 సంవత్సరాలు స్వామి వారికి పట్టువస్త్రాలు ఇచ్చారని, ఇప్పుడు ఆయన కుమారుడు వైఎస్‌.జగన్‌ డిక్లరేషన్‌ ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పారు.

అందరూ డిక్లరేషన్‌ ఇవ్వాల్సిన అవసరం లేదని టిటిడి ఛైర్మన్‌ అనలేదని స్పష్టం చేశారు. ఆ విషయమై తనకు టిటిడి ఛైర్మన్‌ క్లారిటీ కూడా ఇచ్చారని పెద్దిరెడ్డి పేర్కొన్నారు. టిటిడి ఛైర్మన్‌ వైవి సుబ్బారెడ్డి ప్రకటనను వివాదం చేయొద్దని కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మన్యం ధీరుడు.. సీతారామరాజు చిత్రం ఎలా వుందంటే.. రివ్యూ

చిరంజీవికి అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి అవార్డ్ ప్రకటించిన నాగార్జున

జయం రవి కాపురంలో చిచ్చుపెట్టిన బెంగుళూరు సింగర్?

ఫియర్ ద్వారా ఆ లిస్టులో ఇండియా పేరు చూసినప్పుడు గర్వంగా అనిపించింది: దర్శకురాలు హరిత

ప్లీజ్ ... నో పాలిటిక్స్ : రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తింటే ప్రయోజనాలు ఏమిటి?

బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న 7 ఏళ్ల బాలుడికి అమెరికన్ ఆంకాలజీ విజయవంతంగా చికిత్స

పీసీఓఎస్ అవగాహన మాసం: సహజసిద్ధంగా పీసీఓఎస్ నిర్వహణకు చిట్కాలు

యూఎస్ పోలో ఆసన్‌తో కలిసి శ్రీ సవాయి పద్మనాభ్ సింగ్ కలెక్షన్

మణిపాల్ హాస్పిటల్‌కు ఎన్ఏబీహెచ్ డిజిటల్ హెల్త్ అక్రిడిటేషన్-గోల్డ్ లెవెల్

తర్వాతి కథనం
Show comments