Webdunia - Bharat's app for daily news and videos

Install App

వందో రోజుకు రాజధాని రైతుల ఉద్యమం

Webdunia
గురువారం, 26 మార్చి 2020 (19:16 IST)
రాజధాని రైతుల ఉద్యమం వందో రోజుకు చేరింది. ఈ సందర్భంగా మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు రాజధానిగా అమరావతి కొనసాగాలన్న రైతుల ఆకాంక్షను గ్రహించి మూడు రాజధానుల నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

కరోనా సంక్షోభ పరిస్థితుల్లో కూడా రైతుల ఆందోళన కొనసాగుతున్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలన్నారు. కరోనా నిరోధానికి అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటూనే రైతులు తమ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. 

కరోనా నిరోధానికి ఆరోగ్య సిబ్బంది, పోలీసులు, మిలిటరీ దేశం కోసం పోరాడుతున్న విధంగానే అమరావతి కోనం ప్రాణాలను ఫణంగా పెట్టి మరీ రైతులు దీక్షలు కొనసాగిస్తున్నారని చంద్రబాబు అన్నారు.
 
అమరావతి ఉద్యమం 100 రోజులకు చేరుకున్న సందర్భంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ట్విట్టర్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. పెయిడ్ ఆర్టిస్టులని అవమానించినా.. లాఠీ దెబ్బలు కొట్టినా రాజధాని గ్రామాల ప్రజలు సహనం కోల్పోదని కొనియాడారు.

‘‘జై అమరావతి ఉద్యమం 100 రోజులకు చేరుకుంది. పెయిడ్ ఆర్టిసులని అవమానించినా, లాఠీ దెబ్బలు కొట్టినా... వేల మందిని జైలుకి పంపినా సహనం కోల్పోలేదన్నారు. ఐదు కోట్ల ప్రజల భవిష్యత్తు అమరావతిని కాపాడుకోవడానికి ముందుకొచ్చిన రైతులు, మహిళలకి ఉద్యమ వందనాలు’’ అని లోకేష్‌ ట్వీట్‌‌లో పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments