Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ వృద్ధురాలు పెన్షన్ కోసం రాలేదు, ఇంటివద్దే మరణించారు, అవాస్తవాలు నమ్మొద్దు: పల్నాడు జిల్లా కలెక్టర్

ఐవీఆర్
గురువారం, 4 ఏప్రియల్ 2024 (13:29 IST)
కర్టెసి-ట్విట్టర్
పెన్షన్లు కోసం ఎండల్లో పడిగాపులు కాస్తూ పలువురు వృద్ధులు మరణించారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాలను నమ్మవద్దని ఏపీ అధికారులు చెబుతున్నారు. ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా తాము నడవలేని, కదల్లేనివారికి, దివ్యాంగులకు ఇంటికి వెళ్లి పెన్షన్ అందిస్తామని చెబుతున్నారు. దీనిపై పల్నాడు జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... నెహ్రూ నగర్‌కు చెందిన వృద్ధురాలు పెన్షన్ తీసుకునేందుకు వెళ్లి మరణించారంటూ అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారు. వాటిని నమ్మవద్దు. ఆమె ఆరోగ్యం బాగాలేదు. రెండురోజులుగా ఇంటిలోనే వున్నారు. ఆరోగ్యం విషమించి ఇంటివద్దే ఆమె కన్నుమూశారు. ఈ విషయాన్ని ఎంపిడివో దుర్గ ధృవీకరించారు. కనుక అవాస్తవాలను ఎవ్వరూ నమ్మవద్దు.
 
కదల్లేనివారు, వృద్ధులు, దివ్యాంగులకు ఇంటికే పెన్షన్ ఇస్తాము. సచివాలయం సిబ్బంది ద్వారా సమాచారం ఇచ్చాము. సోషల్ మీడియా, ఛానళ్లులో వచ్చే వార్తలు అవాస్తవం.నడవలేని పరిస్థితుల్లో వున్నవారు సచివాలయం వద్దకు రావద్దు. రాబోయే 2 రోజుల్లో పెన్షన్ పంపిణీ జరుగుతుంది. ఆందోళన, అధైర్యం పడవద్దు. అవాస్తవాలను నమ్మవద్దు అని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

NTR; అర్జున్ S/O వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ కి తమ్ముడు వస్తాడు : కళ్యాణ్ రామ్

Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments