Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీడీపీ నేతపై బహిష్కరణ వేటు.. ఎక్కడ .. ఎందుకు?

Webdunia
సోమవారం, 9 జనవరి 2023 (09:44 IST)
శ్రీ అన్నమయ్య జిల్లా తంబళ్ళపల్లె నియోజవర్గానికి చెందిన టీడీపీ నేత మద్దరెడ్డి కొండ్రెడ్డిపై జిల్లా కలెక్టర్ బహిష్కరణ వేశారు. ఆర్ను నెలల పాటు ఆయన జిల్లాలోకి రాకూడాదని జిల్లా కలెక్టర్ గిరీష్ ఆదేశాలు జారీచేశారు. 
 
కురబలకోటలో జరిగిన రాళ్ల దాడి ఘటనకు సంబంధించిన కేసులో కొండ్రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ఆయనకు కలెక్టర్ షోకాజ్ నోటీసు జారీ చేశారు. జిల్లా ఎస్పీ సమర్పించిన నివేదిక ఆధారంగా కొండ్రెడ్డిపై చర్యలు తీసుకున్నట్టు కలెక్టర్ ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. 
 
అలాగే, కొండ్రెడ్డిని తరచూ గొడవలకు దిగే నేరస్థుడిగా గుర్తించినట్టు పేర్కొన్న కలెక్టర్.. ప్రమాదకర కార్యకలాపాల నిరోధక చట్టం 1980 ప్రకారం సెక్షన్ 2(1) కింద కొండ్రెడ్డిన గూండా పరిగణించవచ్చని తెలిపారు. 
 
దీంతో తాజా కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న కొండ్రెడ్డిని బెయిలుపై కడప జైలు నుంచి బయటకు రాగానే జిల్లా కలెక్టర్ బహిష్కరణ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నోటీసులు అందిన రోజు నుంచి ఆర్నెల్లపాటు జిల్లా వదిలి వెళ్లాలని ఆదేశించారు. అలాగే, ట్రైబ్యునల్‌లో అప్పీలు చేసుకునేందుకు 15 రోజుల సమయం ఇచ్చారు. అదేసమయంలో కొండ్రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అతను ఉదయం నుంచి సాయంత్రం వరకు నాతోనే ఉంటాడు... రాహుల్ రవీంద్రన్‍తో బంధంపై సమంత

హీరో ప్రభాస్.. ఒక సాదాసీదా నటుడు మాత్రమే... లెజెండ్ కాదు..: మంచు విష్ణు (Video)

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments