Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తరాఖండ్‌లో కుంగిబోతున్న ఓ గ్రామం.. అప్రమత్తమైన కేంద్రం

Webdunia
సోమవారం, 9 జనవరి 2023 (08:40 IST)
హిమాలయా పర్వత ప్రాంత రాష్ట్రాల్లో ఒకటైన ఉత్తరాఖండ్‌లో ఓ గ్రామం కుంగిపోతోంది. ఆ గ్రామం పేరు జోషిమఠ్. ఇప్పటికే దాదాపు 600కు పై చిలుగు గృహాలు భూమిలోకి కుంగిపోవడం మొదలుపెట్టాయి. మరికొన్ని ఇళ్ళకు బీటలు వచ్చాయి. ఈ విషయాన్ని ఉత్తరాఖండ్ రాష్ట్రం కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది. వెంటనే అప్రమత్తమైన ప్రధానమంత్రి కార్యాలయం జోషిమఠ్ గ్రామానికి ప్రత్యేక నిపుణుల బృందాన్ని పంపింది. పైగా, బీటలు వారిన, కుంగిన గృహాలను తక్షణం కూల్చివేయాలని ఆదేశించింది.
 
మరోవైపు, ప్రధానమంత్రి కార్యాలయం కూడా ఆదివారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించింది. ప్రధాని మోడీ ముఖ్య కార్యదర్శి పీకే మిశ్రా అధ్యక్షత ఈ సమావేశం జరిగింది. ఉత్తరాఖండ్‌ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ సంధు, డీజీపీ అశోక్ కుమార్‌, ఇతర ఉన్నాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. జోషిమఠ్ గ్రామం వేగంగా భూమిలోకి కుంగిపోతోంది. ఇళ్లకు పగుళ్లు వస్తుండటంపై చర్చించారు. 
 
జోషిమఠ్ గ్రామాన్ని పరిశీలించిన నిపుణులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నరు. ఎవరికీ ఎలాంటి హాని జరగకూడదన్నదే తమ ఉద్దేశమని, ఆ దిశగా ప్రయత్నిస్తున్నామని సీఎస్ ఎస్ఎస్ సంధు చెప్పారు. జోషిమఠ్ గ్రామం నుంచి ప్రజలను సురక్షితంగా తరలిస్తున్నామని చెప్పారు. భూమి కుంగిపోవడానికి కారణాలు సత్వరమే తెలుసుకోవాల్సి ఉందన్నారు. కేంద్రం నిపుణులతో మాట్లాడిందని, సోమవారం కూడా నిపుణుల బృందం జోషిమఠ్‌ గ్రామాన్నిసందర్శిస్తుందని ఆయన తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments