Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చిత్తూరు జిల్లాలో మినీ లాక్‌డౌన్.. క్లారిటీ ఇచ్చిన జగన్ సర్కార్

ys jaganmohan reddy
, గురువారం, 29 డిశెంబరు 2022 (19:45 IST)
ఏపీలోని చిత్తూరు జిల్లాలో మినీ లాక్‌డౌన్ విధించారని.. తిరుపతిని కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వార్తలపై ఏపీ సర్కారు క్లారిటీ ఇచ్చింది. ఆ వీడియో ఇప్పటిది కాదని.. 2021కి సంబంధించినదని స్పష్టం చేసింది. 
 
లాక్‌డౌన్ లేదా కరోనా అలెర్ట్‌కు సంబంధించిన ఏవైనా ఉంటే.. వాటిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటిస్తుంది. ఈ వీడియో అవాస్తవమని జగన్ సర్కారు క్లారిటీ ఇచ్చింది. ఇలాంటి వీడియోలు ఫార్వర్డ్ చేసే ముందు ఆ సమాచారాన్ని ఫ్యాక్ట్ చెక్ చేయాలని జగన్ సర్కారు స్పష్టం చేసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమెరికాలో భారీ మంచు తుఫాను.. నయాగరా జలపాతం ఫ్రీజ్