Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాన్నకు నాకు సంబంధం లేదు... నేను మాత్రం టీడీపీలోనే : టీజీ తనయుడు

Webdunia
శనివారం, 22 జూన్ 2019 (11:13 IST)
తన తండ్రి, టీడీపీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ భారతీయ జనతా పార్టీలో చేరినప్పటికీ తాను మాత్రం తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతానని టీజీ వెంకటేష్ తనయుడు టీడీ భరత్ స్పష్టంచేశారు. 
 
ఇటీవల టీడీపీకి చెందిన టీజీ వెంకటేష్‌తో పాటు సుజనా చౌదరి, సీఎం రమేష్, గరికపాటి రామ్మోహన్ రావులు బీజేపీలో చేరిన విషయం తెల్సిందే. ఈ సంఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు అత్యంత నమ్మకస్తులుగా ఉన్న సీఎం రమేష్, సుజనా చౌదరిలు వంటి నేతలు పార్టీ మారడాన్ని టీడీపీ శ్రేణులు జీర్ణించుకోలేక పోతున్నాయి. 
 
ఈ నేపథ్యంలో తన తండ్రి బాటలోనే టీజీ భరత్ కూడా పయనిస్తారనే ఊహాగానాలు వినొస్తున్నాయి. దీనిపై భరత్ స్పందించారు. తన తండ్రి బీజేపీలో చేరుతున్నట్టు తనకు ఢిల్లీ నుంచి ఫోనులో చెప్పారన్నారు. అయితే, ఆయన ఏ పార్టీలో ఉన్నప్పటికీ తాను మాత్రం తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతానని చెప్పారు. 
 
ఈ విషయాన్ని పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు ఫోన్ చేసి చెప్పినట్టు తెలిపారు. ఎంతో ఒత్తిడి ఉన్నప్పటికీ తనపై నమ్మకం ఉంచి టిక్కెట్‌ను పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తనకు కేటాయించారని గుర్తుచేశారు. త్వరలోనే చంద్రబాబు, నారా లోకేశ్‌లను కలిసి అన్ని విషయాలు మాట్లాడుతానని టీజీ భరత్ వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడ్వైజరీ బోర్డ్‌లో భాగం చేసినందుకు ప్ర‌ధాని మోదీకి చిరంజీవి ధ‌న్య‌వాదాలు

త్రిబాణధారి బార్భరిక్ మూవీ నుంచి సిద్ శ్రీరామ్ సాంగ్ రిలీజ్

రమేష్ బాబు ఎందరినో మోసం చేసాడు, సివిల్ కోర్టులో కేసు నడుస్తోంది : -ఫైనాన్సియర్స్ సదానంద్

చాలా కాలంగా మిస్ అయ్యాను, తండేల్ తో మళ్ళీ నాకు తిరిగివచ్చింది : అక్కినేని నాగచైతన్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Rose Day 2025 : రోజ్ డే 2025- ఏ రంగులో గులాబీ పువ్వు? వాడిపోయిన పువ్వులు?

రోజుకి గ్లాసు పాలు తాగడం వల్ల ప్రయోజనాలు ఏమిటి?

శీతాకాలంలో జలుబు, ఈ చిట్కాలతో చెక్

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments