Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీలోకి గంటా శ్రీనివాస రావు .. అవంతి శ్రీనివాస్ ఏమన్నారు?

Webdunia
శనివారం, 22 జూన్ 2019 (10:28 IST)
తెలుగుదేశం పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలోకి చేరారు. ఈ హఠాత్పరిణామంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఖంగుతిన్నారు. బీజేపీతో స్నేహసంబంధాల కోసం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారంటూ వైకాపా నేతలు ఆరోపిస్తున్నారు. బీజేపీతో తెగిపోయిన సంబంధాలను తిరిగి పునరుద్ధరించుకునేందుకు సొంత పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులను చంద్రబాబే పంపించారంటూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ఆరోపించారు. 
 
ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడుపై ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన శనివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని చంద్రబాబు ఎదుర్కోలేకపోతున్నారన్నారు. అందుకే టీడీపీ నేతలను బీజేపీలకి పంపుతున్నారని ఆరోపించారు. 
 
చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన గంటా శ్రీనివాసరావును కూడా త్వరలోనే బీజేపీలోకి పంపుతారని, ఈ విషయంలో పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని అవంతి అన్నారు. చంద్రబాబు ఐదేళ్ల కాలంలో చేసిన అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే టీడీపీ నేతలు బీజేపీలో చేరుతున్నారని ఆరోపించారు. 
 
ఎన్నికల తర్వాత చంద్రబాబు తమ వద్దకే వస్తారన్న అమిత్ షా వ్యాఖ్యలను ఈ సందర్భంగా అవంతి గుర్తు చేశారు. అమిత్ షా వ్యాఖ్యల ఇప్పుడు నిజం అవుతున్నాయని, బీజేపీలోకి టీడీపీ నేతలు క్యూ కడుతున్నారని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. 

సంబంధిత వార్తలు

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments