Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీలోకి గంటా శ్రీనివాస రావు .. అవంతి శ్రీనివాస్ ఏమన్నారు?

Webdunia
శనివారం, 22 జూన్ 2019 (10:28 IST)
తెలుగుదేశం పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలోకి చేరారు. ఈ హఠాత్పరిణామంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఖంగుతిన్నారు. బీజేపీతో స్నేహసంబంధాల కోసం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారంటూ వైకాపా నేతలు ఆరోపిస్తున్నారు. బీజేపీతో తెగిపోయిన సంబంధాలను తిరిగి పునరుద్ధరించుకునేందుకు సొంత పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులను చంద్రబాబే పంపించారంటూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ఆరోపించారు. 
 
ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడుపై ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన శనివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని చంద్రబాబు ఎదుర్కోలేకపోతున్నారన్నారు. అందుకే టీడీపీ నేతలను బీజేపీలకి పంపుతున్నారని ఆరోపించారు. 
 
చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన గంటా శ్రీనివాసరావును కూడా త్వరలోనే బీజేపీలోకి పంపుతారని, ఈ విషయంలో పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని అవంతి అన్నారు. చంద్రబాబు ఐదేళ్ల కాలంలో చేసిన అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే టీడీపీ నేతలు బీజేపీలో చేరుతున్నారని ఆరోపించారు. 
 
ఎన్నికల తర్వాత చంద్రబాబు తమ వద్దకే వస్తారన్న అమిత్ షా వ్యాఖ్యలను ఈ సందర్భంగా అవంతి గుర్తు చేశారు. అమిత్ షా వ్యాఖ్యల ఇప్పుడు నిజం అవుతున్నాయని, బీజేపీలోకి టీడీపీ నేతలు క్యూ కడుతున్నారని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments