Webdunia - Bharat's app for daily news and videos

Install App

చీకటిపై వెలుగు సాధించిన విజయం : తెలుగు సీఎంల దీపావళి శుభాకాంక్షలు

Webdunia
సోమవారం, 24 అక్టోబరు 2022 (09:02 IST)
చీకటిపై వెలుగు సాధించిన విజయం దీపావళి అని, ప్రతి ఒక్కరికి దీపావళి శుభాకాంక్షలు తెలుపుతున్నట్టు రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు వేర్వేరుగా విడుదల చేసిన పత్రికా ప్రకటనలో తెలిపారు. ప్రజల జీవితాల్లో ఆనందకాంతులు నిండాలని ఆయన ఆకాంక్షించారు. 
 
ఇదే విషయంపై ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్టు తెలిపారు. చీకటిపై వెలుగు, చెడుపై మంచి, అజ్ఞానంపై జ్ఞానం, దుష్ట శక్తులపై దైవశక్తి సాధించిన విజయాలకు ప్రతీకకగా దీపావళి పండుగను జరుపుకుంటారని తెలిపారు. 
 
ఈ పండుగ ప్రజలందరి జీవితాల్లో ఆనంద కాంతులు నిండాలని ఆకాంక్షిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఈ పండుగ సందర్భంగా తెలుగు ప్రజలందరికీ శుభాలు, సంపదలు, సౌభాగ్యాలు, విజయాలు కలగాలని, దివ్వెల వెలుగులలో ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో విరాజిల్లాలలని అభిలషించారు. 
 
అలాగే, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందిస్తూ, దేశ ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్టు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయాన్ని పురస్కరించుకుని ఈ పండుగను జరుపుకుంటామని తెలిపారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments