Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరికొన్ని క్షణాల్లో కుమార్తె పెళ్లి.. తల్లి మరణం... వివాహం జరిగిందా? ఆగిందా?

Webdunia
శుక్రవారం, 1 మార్చి 2019 (09:39 IST)
మరికొన్ని క్షణాల్లో కుమార్తె పెళ్లి జరగాల్సి వుంది. ఆ పెళ్లిని కనులారా చూడాలని ఎన్నో కలలుకన్నది. ఇంతలోనే ఆ తల్లి ప్రాణాలు కోల్పోయింది. అప్పటికే ముహుర్తానికి మరికొన్ని క్షణాల్లో ఉండటంతో తల్లి మరణం వార్తను దాచిపెట్టారు. ఆ తర్వాత వధువు మెడలో మూడు ముళ్లు వేయించారు. పిమ్మట కన్నతల్లి మరణ వార్తను కుమార్తెకు చెప్పారు. అపుడు ఆ బిడ్డ తల్లడిల్లిపోయింది. తల్లి ఇకలేదన్న వార్తను ఆమె జీర్ణించుకోలేక నిశ్చేష్టురాలైంది. 
 
ఈ విషాదకర సంఘటన తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, బుడుగు బజారుకు చెందిన కటుకూరి నాగేంద్ర (48) భర్త గతంలోనే చనిపోగా, అన్నీ తానై కుమార్తె ప్రవీణను పెంచి పెద్ద చేసింది. ప్రవీణకు గురువారం తెల్లవారుజామున మొండికుంటకు చెందిన యువకుడితో వివాహం జరిపించేందుకు పెద్దలు నిశ్చయించారు. ఈ ముహూర్తం కోసం వధువు, బంధువులు రాత్రి 11.30 గంటలకు అశ్వాపురం నుంచి వాహనాల్లో బయలుదేరారు. 
 
వీరి కార్లు ముందుగానే వివాహ మండపానికి చేరుకోగా, వధువు తల్లి, ఇతర బంధువులు ప్రయాణిస్తున్న కారు చింతిర్యాల అడ్డరోడ్డు వద్ద అదుపు తప్పి చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో వధువు తల్లికి తీవ్రగాయాలు కాగా, ఆసుపత్రికి తరలిస్తుండగానే ఆమె మృతి చెందింది. విషయం కుమార్తెకు చెబితే, ఆమె పెళ్లికి అంగీకరించబోదని భావించిన బంధువులు, ప్రవీణ వివాహాన్ని జరిపించారు. ఆ తర్వాత తల్లి ఇకలేదనే వార్తను కుమార్తెకు చెప్పడంతో ఆమె పెళ్లి మండపంలోనే కుప్పకూలిపోయింది. ఆ నవ వధువు, తల్లి మృతదేహం ముందు బోరున విలపిస్తుంటే ఎవరూ ఓదార్చలేకపోయారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments