Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

500 సిక్సర్ల వీరుడు.. ఎవరు...

500 సిక్సర్ల వీరుడు.. ఎవరు...
, గురువారం, 28 ఫిబ్రవరి 2019 (11:19 IST)
వెస్టిండీస్ క్రికెటర్ క్రిస్ గేల్. ఏ పని చేసినా అది సంచలనమే అవుతుంది. బ్యాట్ పట్టుకుని క్రీజ్‌లోకి వచ్చినా.. లేదా పబ్బులు, క్లబ్బుల్లో తిరిగినా అది మీడియాకు ఓ మంచి వార్త. తాజాగా క్రిస్ గేల్ మరోమారు మీడియా దృష్టిని ఆకర్షించాడు. వ‌న్డేల్లో ప‌దివేల ప‌రుగుల మైలురాయిని దాటేశాడు. 
 
సెయింట్ జార్జ్‌లో ఇంగ్లండ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో గేల్ 162 ర‌న్స్ చేశాడు. గేల్‌కు ఇది 25వ వ‌న్డే సెంచ‌రీ కాగా, 39 ఏళ్ల గేల్ అంత‌ర్జాతీయ క్రికెట్‌లో మూడు ఫార్మెట్లలో కలుపుకుని 500 సిక్స‌ర్లు కొట్టిన ప్లేయ‌ర్‌గా కూడా రికార్డు క్రియేట్ చేశాడు. 
 
అలాగే, వ‌న్డేల్లో ప‌దివేల ప‌రుగుల మైలురాయిని దాటిన 14వ బ్యాట్స్‌మెన్‌గా చ‌రిత్ర‌కెక్కాడు. ఈ ఘ‌ట‌న సాధించిన రెండో వెస్టిండీస్ క్రికెట్ ఆటగాడిగా గేల్ నిలిచాడు. గతంలో వ‌న్డేల్లో ప‌ది వేల ప‌రుగుల చేసిన ప్లేయ‌ర్ల‌లో బ్రియాన్ లారా ముందు వరుసలో ఉన్నాడు. కాగా, త్వరలో జరుగనున్న ప్రపంచ క్రికెట్ కప్ తర్వాత క్రిస్ గేల్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పనున్నాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కంగారులను పిలిపించి కుమ్మించుకున్న టీమిండియా