Webdunia - Bharat's app for daily news and videos

Install App

దొంగచాటు పడకసుఖం ఇవ్వాల్సిందేనంటూ మహిళకు నిప్పు

Webdunia
శుక్రవారం, 27 డిశెంబరు 2019 (12:44 IST)
తనతో కుట్టుచప్పుడు కాకుండా వివాహేతర సంబంధం కొనసాగంచాలంటూ ఓ మహిళను ఓ వ్యక్తి ఒత్తిడి తెచ్చాడు. దీనికి ఆ మహిళ అంగీకరించలేదు. దీంతో ఆ మహిళపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. ఈ దారుణం తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్ జిల్లాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, వికారాబాద్ జిల్లా తండూరుకు చెందిన అంజిలమ్మ (40) అనే మహిళతో అగ్గనూరు గ్రామానికి చెందిన నర్సింహులు (45) అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి, అది వివాహేతర సంబంధానికి దారితీసింది. అయితే, కొన్ని రోజులుగా అంజిలమ్మ అతనికి దూరంగా ఉంటూ వచ్చింది. దీంతో ఆగ్రహించిన నర్సింహులు.. తనతో అక్రమ సంబంధం కొనసాగించాలంటూ ఒత్తిడి చేయగా, అందుకు ఆమె నిరాకరించింది. 
 
ఈ పరిస్థితుల్లో గురువారం రాత్రి 11 గంటలకు ఆమెపై కిరోసిస్ పోసి నిప్పంటించాడు. దీంతో ఆమె తీవ్ర గాయాలపాలైంది. అనంతరం నర్సింహులు కూడా ఆత్మహత్యాయత్నం చేశాడు. వారివద్దరికీ తాండూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందుతోందని, వారి పరిస్థితి విషమంగా ఉందని ఈ రోజు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అంజిలమ్మ కుటుంబ సభ్యులపై కూడా నర్సింహులు కిరోసిన్‌ పోసి నిప్పంటించినట్లు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments