Webdunia - Bharat's app for daily news and videos

Install App

మా అల్లుడిని చంపేశానంటూ లొంగిపోయిన మామ.. ఖాకీలు ఇంటికి రాగానే...

తమ అల్లుడిని చంపేశానంటూ ఓ మామ పోలీసులకు లొంగిపోయాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి శవం కోసం ఇంటికి వచ్చారు. అయితే, అల్లుడు తాపీగా కూర్చొని చెకోడీలు తింటూ కనిపించడంతో పోలీసులు షాక్‌కు గురైయ్యారు. ఈ ఘట

Webdunia
గురువారం, 9 ఆగస్టు 2018 (10:36 IST)
తమ అల్లుడిని చంపేశానంటూ ఓ మామ పోలీసులకు లొంగిపోయాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి శవం కోసం ఇంటికి వచ్చారు. అయితే, అల్లుడు తాపీగా కూర్చొని చెకోడీలు తింటూ కనిపించడంతో పోలీసులు షాక్‌కు గురైయ్యారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో జరిగింది.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, కొత్తనారంవారిగూడేనికి చెందిన గురింద నాగులు అనే వ్యక్తి అల్లుడు రాజు. నిత్యం తాగొచ్చి నానా యాగీ చేస్తుంటాడు. బుధవారం ఉదయం కూడా మద్యం మత్తులో వచ్చి మామతోపాటు భార్యను వేధించాడు. అల్లుడి గోల భరించలేని మామ.. లాగి పెట్టి చెంపమీద కొట్టాడు. 
 
ఆ దెబ్బతో దిమ్మదిరిగిన రాజు గింగరాలు తిరుగుతూ కింద పడిపోయాడు. నోట మాటలేదు. దీంతో చనిపోయాడని భావించిన మామ నాగులు నేరుగా స్థానిక పోలీస్ ఠాణాకు వెళ్లి.. మా అల్లుడుని చంపేశా.. కేసు నమోదు చేసి అరెస్టు చేయండి అంటూ లొంగిపోయాడు. 
 
దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు... సంఘటనాస్థలానికి వెళ్లారు. అక్కడ అల్లుడు రాజు చక్కగా లేచి కూర్కొని చెకోడీలు తింటూ కనిపించాడు. పైగా, స్థానిక ఆర్‌ఎంపీ వైద్యుడుతో వైద్యం కూడా చేయించుకున్నాడు. మామ చేసిన పోలీసులతో పాటు స్థానికులు కూడా విస్తుపోయారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments