Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాపురంలో కలహాలు : అత్తను గొడ్డలితో నరికి చంపిన అల్లుడు... భార్యపై కూడా...

Webdunia
బుధవారం, 15 మే 2019 (12:45 IST)
తెలంగాణ రాష్ట్రంలోని ప్రొఫెసర్ జయశంకర్ భూపాలవల్లిలో దారుణం జరిగింది. కాపురంలో కలహాల కారణంగా అత్తను ఓ అల్లుడు గొడ్డలితో నరికి చంపేశాడు. అడ్డొచ్చిన భార్యపై కూడా దాడి చేశాడు. ఈ దాడిలో అత్త ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోగా, తీవ్రంగా గాయపడిన భార్య పరిస్థితి విషమంగా ఉంది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని రేగొండ మండలం చెన్నాపూర్‌ గ్రామానికి చెందిన ఒన్నాల లక్ష్మి, సుజాత అనే మహిళలు తల్లీకూతుళ్లు. అయితే కాపురంలో చెలరేగిన మనస్పర్థల కారణంగా తీవ్ర ఆగ్రహానికిగురైన అల్లుడు అత్తను గొడ్డలితో నరికాడు. ఈ దాడిలో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. 
 
తల్లిపై భర్త చేస్తున్న దాడిని అడ్డుకునేందుకు సుజాత ప్రయత్నించడంతో ఆమెపై కూడా దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన సుజాత పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేశారు. నిందితుడి కోసం గాలిస్తూ, తీవ్రంగా గాయపడిన సుజాతను ఆస్పత్రికి తరలించారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments