Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాపురంలో కలహాలు : అత్తను గొడ్డలితో నరికి చంపిన అల్లుడు... భార్యపై కూడా...

Webdunia
బుధవారం, 15 మే 2019 (12:45 IST)
తెలంగాణ రాష్ట్రంలోని ప్రొఫెసర్ జయశంకర్ భూపాలవల్లిలో దారుణం జరిగింది. కాపురంలో కలహాల కారణంగా అత్తను ఓ అల్లుడు గొడ్డలితో నరికి చంపేశాడు. అడ్డొచ్చిన భార్యపై కూడా దాడి చేశాడు. ఈ దాడిలో అత్త ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోగా, తీవ్రంగా గాయపడిన భార్య పరిస్థితి విషమంగా ఉంది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని రేగొండ మండలం చెన్నాపూర్‌ గ్రామానికి చెందిన ఒన్నాల లక్ష్మి, సుజాత అనే మహిళలు తల్లీకూతుళ్లు. అయితే కాపురంలో చెలరేగిన మనస్పర్థల కారణంగా తీవ్ర ఆగ్రహానికిగురైన అల్లుడు అత్తను గొడ్డలితో నరికాడు. ఈ దాడిలో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. 
 
తల్లిపై భర్త చేస్తున్న దాడిని అడ్డుకునేందుకు సుజాత ప్రయత్నించడంతో ఆమెపై కూడా దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన సుజాత పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేశారు. నిందితుడి కోసం గాలిస్తూ, తీవ్రంగా గాయపడిన సుజాతను ఆస్పత్రికి తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments