Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్టీసి కార్మిక నేతలు కూడా డ్యూటీలు చేయాల్సిందే...

Webdunia
ఆదివారం, 1 డిశెంబరు 2019 (13:30 IST)
ఆర్టీసీ కార్మికులు అందరూ కూడా విధుల్లో చేరారు. తమను విధుల్లో చేర్చుకోవాలంటూ కార్మికులు ప్రభుత్వాన్ని వేడుకోవడంతో సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. అందరినీ డ్యూటీల్లో చేరి… ఉద్యోగాలు చేసుకోండని చెప్పారు. 
 
మరోవైపు బస్సు భవన్‌లోని అధికారిక కార్మిక సంఘం టీఎంయు కార్యాలయానికి ఆర్టీసీ యాజమాన్యం తాళం వేసింది. అంతేకాదు ఆర్టీసి కార్మిక నేతలు కూడా ఇప్పటి నుంచి సాధారణ కార్మికుల మాదిరిగానే విధులు నిర్వహించాల్సిందేనని తెలిపింది. 
 
ఇప్పటివరకూ వారికి కల్పించిన విధులు నుంచి మినహాయింపు హక్కులను రద్దు చేసింది. దీని ప్రకారం ఆర్టీసి కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామ రెడ్డితో సహా యునియన్‌ నేతలంతా డ్యూటీలు చేయాలి. ఇతర కార్మికుల మాదిరిగానే వారందరు విధులకు హాజరు కావాల్సిందేనని తేల్చి చెప్పారు అధికారులు.
 
ఇప్పటివరకు మొత్తం 30 మంది కార్మిక నేతలకు డ్యూటీ మినహాయింపు ఉండేది. ఇందులో అధికారిక కార్మిక సంఘమైన తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌కు చెందిన వారు 26 మంది ఉన్నారు. ఇంకా కార్మికుల నుంచి యూనియన్‌ సభ్యత్వ రుసుమును వసూలు చేసే విధానానికి కూడా త్వరలో చెక్‌ పెట్టాలని అధికారులు భావిస్తున్నారు. ముఖ్యంగా ఆర్టీసీ యూనియన్లు ఉండకూడదని అధికారులు చర్యలు చేపట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi: ఎ.ఆర్.రెహమాన్ మిక్సింగ్ పూర్తి - పెద్ది ఫస్ట్ షాట్‌ సిద్ధం

Trivikram Srinivas: ఆయన నిజంగానే జైంట్ : త్రివిక్రమ్ శ్రీనివాస్

NTR: రావణుడి కంటే రాముడి పాత్ర కష్టం, అందుకే అదుర్స్ 2 చేయలేకపోతున్నా : ఎన్టీఆర్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments