Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ పంచాయతీ పోల్ : కుటుంబమంతా గెలిచింది.. ఎలా?

Webdunia
సోమవారం, 28 జనవరి 2019 (14:44 IST)
తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో భాగంగా, అసిఫాబాద్ జిల్లా కౌటల మండలం బోధంపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓ కుటుంబంలోని సభ్యులంతా గెలుపొందారు. ఈ కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులు పోటీ చేయగా, వారంతా విజయం సాధించారు. 
 
ఈ పంచాయతీ ఎన్నికల్లో గ్రామ సర్పంచి పదవి, ఉప సర్పంచి పదవి, ముగ్గురు వార్డు మెంబర్లుగా పోటీ చేసి గెలుపొందారు. దీనికి కారణం ఈ గ్రామ పంచాయతీ ఎస్టీ రిజర్వుడు కావడంతో ఈ కుటుంబంలోని సభ్యులంతా పోటీ చేసే పరిస్థితి ఏర్పడింది. 
 
ఈ ఎన్నికల్లో గ్రామ సర్పంచ్‌గా రెడ్డి శంకర్ గెలుపొందగా, ఉప సర్పంచ్‌గా అతని రెడ్డి కమల, వార్డు మెంబర్లుగా శంకర్ అన్న భీమయ్య ఐదో వార్డులో, భీమయ్య భార్య సుశీల ఆరో వార్డులో, శంకర్ - భీమయ్యల తల్లి దుర్గమ్మ ఒకటో వార్డులో పోటీ చేసి గెలుపొందారు. ఒకే ఫ్యామిలీ నుంచి ఏకంగా ఐదుగురు గెలుపొందడంతో ఈ కుటుంబాన్ని పవర్‌ఫుల్ ఫ్యామిలీగా స్థానికులు పేర్కొంటున్నారు. 

సంబంధిత వార్తలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments