Webdunia - Bharat's app for daily news and videos

Install App

కూల్‌డ్రింక్‌లో మత్తుపదార్థాలు కలిపి....

Webdunia
ఆదివారం, 19 మే 2019 (10:54 IST)
తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో ఓ యువకుడు కూల్‌డ్రింక్‌లో మత్తుపదార్థం కలిపి ఓ వివాహితకు ఇచ్చాడు. ఆ తర్వాత అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ విషయం తెలుసుకున్న బాధిత కుటుంబ సభ్యులు అతన్ని పట్టుకుని దేహశుద్ధి చేశారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని నిర్మల్‌కు చెందిన అనిల్‌ నిజామాబాద్‌లోని ఎల్లమ్మగుట్ట కాలనీకి చెందిన ఓ వివాహితపై కన్నేశాడు. ఆమెతో లైంగికసుఖం పొందాలని భావించాడు. అంతే.. కూల్‌‌డ్రింక్‌లో మత్తు పదార్థాలు కలిపి ఆమెకు ఇచ్చాడు. అసలు విషయం తెలియని ఆ వివాహిత కూల్‌డ్రింక్ తాగగానే అపస్మారక స్థితిలోకి జారుకుంది. 
 
ఇక తన పంటపండిందని భావించిన ఆ కామాంధుడు.. ఆ వివాహిత పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఫొటోలు, వీడియోలు తీశాడు. అంతేకాకుండా వాటిని ఆమె భర్తకు పంపించాడు. దీంతో భార్యను అనుమానించిన భర్త.. ఆమెను పుట్టింటికి పంపించాడు. అసభ్య వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్‌ చేస్తున్న కామాంధుడు అనిల్‌ను.. బాధితురాలి తరపు బంధువులు పట్టుకున్నారు. అందరూ కలిసి ఆ నీచుడికి దేహశుద్ధి చేశారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments