Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీకి జేడీయూ షాక్... సాధ్వీని బహిష్కరించాల్సిందేనంటూ డిమాండ్

Webdunia
ఆదివారం, 19 మే 2019 (10:33 IST)
బీహార్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి ఆ రాష్ట్ర అధికార జేడీయు తేరుకోలని షాకిచ్చింది. సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఆదివారం ఏడో రౌండ్ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న సమయంలో జేడీయూ సరికొత్త డిమాండ్‌ను తెరపైకి తెచ్చింది. 
 
జాతిపిత మహాత్మా గాంధీని కాల్చి చంపిన నాథూరాం గాడ్సేను గొప్ప దేశభక్తుడంటూ బీజేపీ భోపాల్ లోక్‌సభ అభ్యర్థి సాధ్వీ ప్రజ్ఞా సింగ్ చేసిన వ్యాఖ్యలను జేడీయూ ఖండిస్తూనే ఆమెను పార్టీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేసింది. 
 
పాట్నాలో ఆదివారం ఓటు హక్కు వినియోగించుకున్న బీహార్ ముఖ్యమంత్రి, జేడీయు అధినేత నితీష్‌ కుమార్‌ను ప్రజ్ఞాసింగ్ వ్యాఖ్యలపై మీడియా ప్రశ్నించింది. దీనిపై ఆయన స్పందిస్తూ, ఆమె (ప్రగ్యా సింగ్) వ్యాఖ్యలను తాము ఖండిస్తున్నామని, అలాంటి వ్యాఖ్యలకు తమ మద్దతు ఉండదన్నారు. అయితే అది పూర్తిగా బీజేపీ అంతర్గత వ్యవహారమని, సాధ్వీపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. 
 
ఇకపోతే, కాశ్మీర్‌లో 370వ అధికరణను రద్దు చేస్తామంటూ ఈ ఎన్నికల్లో బీజేపీ ప్రధానంగా ప్రస్తావించడంపై అడిగిన ఓ ప్రశ్నకు సైతం నితీష్ భిన్నంగా స్పందించారు. 370 అధికరణ తొలగింపును తాము మద్దతు ఇవ్వబోమని తేల్చి చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments