Webdunia - Bharat's app for daily news and videos

Install App

'స్వస్తిక్' గుర్తు ఉంటేనే ఓటు : తెలంగాణా హైకోర్టు

Webdunia
శుక్రవారం, 4 డిశెంబరు 2020 (10:28 IST)
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో స్వస్తిక్ గుర్తుకాకుండా, ఏ గుర్తు ఉన్నా ఓటుగా పరిగణించాలన్న రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వలును హైకోర్టు సస్పెండ్ చేసింది. కోర్ట్ తదుపరి ఉత్తర్వులకు లోబడే ఫలితాలు విడుదల చేయాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. 
 
బ్యాలెట్‌పై స్వస్తిక్‌ గుర్తుతో పాటు మార్కర్ పెన్‌తో టిక్ చేసినా పరిగణలోకి తీసుకోవాలంటూ గత రాత్రి అధికారులకు ఎస్‌ఈసీ సర్క్యూలర్ జారీ చేశారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిస బీజేపీ... హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్‌ను దాఖలు చేసింది. 
 
బీజేపీ పిటిషన్‌ను శుక్రవారం ఉదయం విచారించిన ధర్మాసనం స్వస్తిక్ గుర్తు కాకుండా ఏ గుర్తు ఉంటేనే ఓటుగా పరిగణించాలని సూచించింది. స్వస్తిక్ గుర్తు కాకుండా ఇతర గుర్తులు ఉంటే కోర్టు తదుపరి ఆదేశాలకు లోబడే ఫలితాలు విడుదల చేయాలని ఆదేశించింది.
 
కాగా, ఎన్నికల సంఘం రాత్రికి రాత్రి జారీచేసిన సర్క్యూలర్‌పై విపక్ష నేతలు తీవ్రంగా మండిపడ్డారు. గతంలో జారీ చేసిన నిబంధనల్లో ఈ నిబంధన ఎందుకు చేర్చలేదంటూ నిలదీశారు. ఈ సర్క్యూలర్‌ను సీరియస్‌గా తీసుకున్న బీజేపీ హైకోర్టును ఆశ్రయించడంతో ఈ సమస్యకు పరిష్కారం చిక్కింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Kalyan: హరిహరవీరమల్లు కథ రివీల్ చేస్తూ రిలీజ్ డేట్ ప్రకటన

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments