Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైఎస్.వివేకా హత్య కేసులో కీలక మలుపు.. ఏ1 గంగిరెడ్డి బెయిల్ రద్దు

Webdunia
గురువారం, 27 ఏప్రియల్ 2023 (13:13 IST)
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో గురువారం కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏ1గా ఉన్న ఎర్ర గంగిరెడ్డికి గతంలో పులివెందుల కోర్టు మంజూరుచేసిన బెయిల్‌ను తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది. పైగా, వచ్చే నెల ఐదో తేదీలోపు సీబీఐ కోర్టులో లొంగిపోవాలని ఆదేశించింది. గంగిరెడ్డి బయట స్వేచ్ఛగా తిరుగుతూ సాక్షులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాడని సీబీఐ హైకోర్టుకు తెలపడంతో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. వివేకా హత్య కేసు విచారణ కీలక దశకు చేరుకుందని, అందువల్ల ఈ కేసులో ప్రధాన నిందితుడు గంగిరెడ్డి బయటవుంటే దర్యాప్తుపై ప్రభావం పడుతుందని, సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ హైకోర్టుకు సీబీఐ తెలిపింది. 
 
కాగా, వివేకా హత్య కేసు దర్యాప్తులో భాగంగా, ఏపీ ప్రభుత్వం తొలుత ప్రత్యేక దర్యాప్తు సిట్‌ను ఏర్పాటు చేసి విచారణ జరిపించిన విషయం తెల్సిందే. ఈ కేసులో 90 రోజులు గడిచిపోయినా గంగిరెడ్డిపై సిట్ అఫిడవిట్ దాఖలు చేయలేదు. నిబంధనల ప్రకారం నిందితులపై 90 రోజుల్లో అఫిడవిట్ దాఖలు చేయాల్సివుంది. లేనిపక్షంలో సాంకేతిక కారణాలతో బెయిల్ లభిస్తుంది. ఇదే కారణంతో గంగిరెడ్డి బెయిల్‌పై జైలు నుంచి బయటకు వచ్చారు. 2019 జూన్ 27వ తేదీన గంగిరెడ్డికి పులివెందుల కోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓజీ షూటింగ్‌కు హాజరుకానున్న పవన్ కళ్యాణ్?

ఫీమేల్ ఓరియెంటెడ్‌గా ప్రియాంక ఉపేంద్ర ఉగ్రావతారం సినిమా

వరుణ్ తేజ్ మట్కా పవర్ ప్యాక్డ్ రిలీజ్ న్యూ పోస్టర్

సిద్దిఖీ హత్యతో సల్మాన్‌ ఖాన్‌కూ చావు భయం‌ పట్టుకుందా?

శ్రీమురళి, ప్రశాంత్ నీల్ కాంబోలో బగీరా నుంచి రుధిర హారా సింగిల్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిరోజూ రాత్రిపూట ఒక్క యాలుక్కాయ తింటే?

హైదరాబాద్ తర్వాత ప్రపంచంలోనే తొలిసారిగా పరాయి గడ్డ యూకెలో అలాయి బలాయి

డార్క్ చాక్లెట్ తింటే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుందా?

ఐరన్ లోపం వున్నవాళ్లు ఈ పదార్థాలు తింటే ఎంతో మేలు, ఏంటవి?

మధుమేహం-సంబంధిత దృష్టి నష్టాన్ని నివారించే లక్ష్యంతో డయాబెటిక్ రెటినోపతి స్క్రీనింగ్

తర్వాతి కథనం
Show comments