Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాషాయం వైపు కోమటిరెడ్డి... మరో ఇద్దరు మాజీ కేంద్ర మంత్రులు కూడా...

Webdunia
ఆదివారం, 23 జూన్ 2019 (15:25 IST)
తెలుగు రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేసే దిశగా భారతీయ జనతా పార్టీ నాయకత్వం దృష్టిసారించినట్టు తెలుస్తోంది. ఇందులోభాగంగా, కీలక నేతలను తమలో చేర్చుకుంటుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీకి చెందిన ముగ్గురు రాజ్యసభ్యులతో పాటు... తెలంగాణ ప్రాంతానికి గరికపాటి మోహన్ రావు (టీడీపీ)లు బీజేపీలో చేరిపోయారు. 
 
తాజాగా, తెలంగాణా ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నేతలు బీజేపీలో చేరనున్నారు. ముఖ్యంగా కేంద్ర మాజీ మంత్రులు బలరాం నాయక్‌, సర్వే సత్యనారాయణ బీజేపీతో మంతనాలు జరుపుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. బీజేపీలో చేరేందుకు సర్వే సిద్ధమయ్యారని.. కాంగ్రెస్ ఎమ్మెల్యే, కీలకనేత రాజగోపాల్‌రెడ్డితో పాటు బీజేపీలో చేరే టీమ్‌లో ఆయన ఉన్నారని తెలుస్తోంది. 
 
అయితే ఈ చేరికలపై బలరాం నాయక్ మీడియాతో మాట్లాడుతూ.. మమ్మల్ని బీజేపీ నేతలు సంప్రదించిన మాట వాస్తవమేనని స్పష్టంచేశారు. అయితే తాను మాత్రం పార్టీ మారడానికి సిద్ధంగా లేనని.. ప్రాణమున్నంతవరకు కాంగ్రెస్‌లోనే ఉంటానని బలరాం నాయక్‌ చెప్పుకొచ్చారు. కాగా.. తెలుగు రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేసుకోవడానికి బీజేపీ 'ఆపరేషన్ ఆకర్ష్'కు తెరలేపిన సంగతి తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షిర్డీ సాయిబాబా ఆలయాన్ని సందర్శించిన మోహన్ బాబు (video)

Prabhas: రాజా సాబ్ అందుకే ఆలస్యమవుతోందని తేల్చి చెప్పిన డైరెక్టర్ మారుతి

Tamannaah: గాడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ మరో స్థాయిలో ఓదెల 2 వుంటుంది : తమన్నా భాటియా

Pawan Kalyan: సింగపూర్ బయల్దేరిన చిరంజీవి, సురేఖ, పవన్ కళ్యాణ్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments