Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుట్కా వేసుకుంటూ బస్సును గుంటలో బోల్తా కొట్టించిన డ్రైవర్

Webdunia
బుధవారం, 15 మే 2019 (14:48 IST)
తెలంగాణ రాష్ట్రంలోని ప్రొఫెసర్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఓ డ్రైవర్ తన విధుల్లో నిర్లక్ష్యంగా నడుచుకున్నాడు. ఫలితంగా బస్సు బోల్తాపడింది. ఈ ఘటనలో 35 మంది వరకు గాయపడ్డారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 60 మంది వరకు ప్రయాణికులు ఉన్నారు. 
 
బుధవారం జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే, భూపాలపల్లి జిల్లాలోని మల్హార్ మండలం సోమన్‌పల్లి వంతెన వద్ద బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. బస్సు డ్రైవర్.. బస్సు రన్నింగ్‌లో ఉండగా.. గుట్కా వేసుకోవడంతో బస్సు అదుపుతప్పి బోల్తా కొట్టినట్టు బస్సులోని ప్రయాణికులు తెలిపారు. బస్సు గోదావరిఖని నుంచి భూపాలపల్లి వెళ్తుండ‌గా ఈ ప్రమాదం జరిగింది. 
 
ఈ ప్రమాదంలో 35 మందికి గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో 60 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. గాయపడిన వారిని మహదేవ్‌పూర్ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఎవరికీ ప్రాణాపాయం లేదని వైద్యులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments