Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేసిన మేకలు.. ఫైన్ వేసిన పోలీసులు.. ఎలా.. ఎక్కడ?

Webdunia
గురువారం, 12 సెప్టెంబరు 2019 (20:50 IST)
తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాలో రెండు మేకలకు పోలీసులు జరిమానా విధించారు. ఈ మేకలు చేసిన నేరమేంటో తెలుసా? ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసినందుకు. ఇంతకు ఆ మేకలు ప్రభుత్వ ఆస్తులను ఎలా ధ్వంసం చేశాయో తెలుసుకుందాం. 
 
కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌లో స్థానికంగా పని చేసే సేవ్ ది ట్రీస్ అనే ఓ ఎన్జీవో సంస్థ సుమారుగా వెయ్యి మొక్కలను నాటింది. అయితే, అదే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి చెందిన రెండు మేకలు ఆ మొక్కల్లో 280 నుంచి 300 మొక్కలను మేశాయి. వీటిలో తెలంగాణ ప్రభుత్వం హరితహారం కింద నాటిన మొక్కలు కూడా ఉన్నాయి. అంటే ఈ మొక్కలను ప్రభుత్వ ఆస్తులుగా పోలీసులు పరిగణించారు. 
 
ఈ నేపథ్యంలో మొక్కలను తినేస్తున్న రెండు మేకలను ఎన్జీవో సభ్యులు పట్టుకెళ్లి పోలీసు అధికారులకు అప్పగించారు. దీంతో తన మేకలు కనిపించకపోవడంతో వాటి యజమాని రాజయ్య స్టేషన్‌కు రాగా, పోలీసులు రూ.వెయ్యి జరిమానా విధించారు. మరో ప్రత్యామ్నాయం లేకపోవడంతో ఆ మొత్తం జరిమానా కట్టిన సదరు యజమాని, తన మేకలను విడిపించుకుని వెళ్లారు. మొత్తంమీద ఈ సంఘటన స్థానికులను ముక్కున వేలేసుకునేలా చేసింది. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments