Webdunia - Bharat's app for daily news and videos

Install App

తితిదే వెబ్‌సైట్లలో సాంకేతిక లోపం.. నిలిచిన టిక్కెట్ల బుకింగ్

Webdunia
శుక్రవారం, 24 సెప్టెంబరు 2021 (12:31 IST)
తితిదే వెబ్‌సైట్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల బుకింగ్‌ నిలిచిపోయింది. ఆన్‌లైన్‌లో టికెట్ల కొనుగోలుకు భారీగా భక్తులు ఒక్కసారిగా యత్నించడంతో సమస్య ఏర్పడినట్లు అధికారులు చెబుతున్నారు. 
 
శుక్రవారం అక్టోబర్‌ నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశం దర్శనం టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేయడం జరిగింది. అక్టోబర్‌ 1 నుంచి 25 వరకు రోజుకు 8 వేల టికెట్లు చొప్పున అందుబాటులో ఉంచింది. దీంతో పెద్ద ఎత్తున భక్తులు వాటిని కొనుగోలు చేసేందుకు ప్రయత్నించారు. 
 
ఈ క్రమంలో తితిదే వెబ్‌సైట్‌ సర్వర్లు మొరాయించాయి. ఈ సాంకేతిక సమస్య కారణంగా వెబ్‌సైట్లు మొరాయించాయి. గతంలోనూ పలుమార్లు ఇదే తరహా సమస్య వచ్చింది. జియో సర్వర్‌తో అనుసంధానించినప్పటికీ తిరిగి మళ్లీ సాంకేతిక లోపం ఏర్పడింది. 
 
దీన్ని పరిష్కరించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. సాంకేతిక సమస్యను పరిష్కరించిన తర్వాత ప్రత్యేక ప్రవేశదర్శనం టికెట్లపై తితిదే ప్రకటన చేసే అవకాశముంది. కాగా, శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులు విధిగా కరోనా వ్యాక్సిన్ సర్టిఫికేట్ లేదా నెగెటివ్ రిపోర్టు వెంట తీసుకుని వెళ్ళాలన్న నిబంధనను అమల్లోకి తెచ్చింది. 

సంబంధిత వార్తలు

కల్కి 2898 AD నుంచి ప్రభాస్, దిల్జిత్ దోసాంజ్ 'భైరవ అంథమ్' రిలీజ్

షో రీల్ తో ఆకట్టుకున్న మిస్టర్ బచ్చన్

అంజలి బహిష్కరణ చేసింది ఎవరిని?

సినిమా రంగంలో సవాళ్లు నేపథ్యంగా ఇట్లు... మీ సినిమా

అనుపమ పరమేశ్వరన్ నటిసున్న పరదా లో దర్శన రాజేంద్రన్ పరిచయం

అసిడిటీ తగ్గించుకోవడానికి అద్భుతమైన చిట్కాలు

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

తర్వాతి కథనం
Show comments