Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి సేవలో నారా లోకేశ్ - రేపటి నుంచి పాదయాత్ర

Webdunia
గురువారం, 26 జనవరి 2023 (10:45 IST)
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ గురువారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. ఇందుకోసం ఆయన బుధవారం రాత్రికే తిరుమల క్షేత్రానికి చేరుకుని, గురువారం ఉదయం స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆయన రాకతో తిరుమల, తిరుపతిలో టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహంతో పాటు కోలాహలం నెలకొంది. 
 
తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తిరుమల స్వామివారిని దర్శనం తర్వాత కుప్పం చేరుకుని రాత్రికి ఆర్ అండ్ బి అతిథి గృహంలో బస చేస్తారు. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు కుప్పం మున్సిపాలిటీ లక్ష్మీపురం నుంచి వరదరాజులు దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత తాను యువగళం పేరుతో చేపట్టిన పాదయాత్రను ప్రారంభిస్తారు. 
 
ఇందులోభాగంగా, కమతమూరు రోడ్డులో నిర్వహించే బహిరంగసభలో ఆయన పాల్గొంటారు. ఆ తర్వాత గుడుపల్లె మండలం శెట్టిపల్లికి చేరుకుంటారు. రాత్రికి పీఈఎస్ మెడక్ల కాలేజీ ఎదుట ఉన్న ఓ ప్రైవేటు స్థలంలో లోకే‌శ్ బస చేస్తారు. రెండో రోజు అక్కడ నుంచి ఆయన శాంతిపురం మండలంలోకి ప్రవేశిస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Janhvi Kapoor : RC16 లో టెర్రిఫిక్ రోల్ చేస్తున్న జాన్వి కపూర్ !

ఉపవాసం దీక్ష తో మూకుత్తి అమ్మన్ 2 చిత్ర పూజకు హాజరైన నయనతార

మ్యారేజ్ అంటే ఒప్పందం, సెటిల్మెంట్ కాదని చెప్పే చిత్రం మిస్టర్ రెడ్డి

Divya Bharathi: యాక్షన్ సీన్స్ చేయడం కష్టం, ఇలాంటి సినిమా మళ్ళీ రాదు : దివ్యభారతి

Mahesh Babu: రేపటి నుంచి ఒరిస్సా లో రాజమౌళి, మహేశ్‌బాబు సినిమా షూటింగ్‌ - తాజా అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలు ప్రతిరోజూ ఆపిల్ కాదు.. ఆరెంజ్ పండు తీసుకుంటే.. ఏంటి లాభమో తెలుసా?

Hibiscus Flower: మహిళలకు మెరిసే అందం కోసం మందార పువ్వు

పుచ్చకాయ ముక్కను ఫ్రిడ్జిలో పెట్టి తింటున్నారా?

Dry Fish: ఎండుచేపలు ఎవరు తినకూడదు.. మహిళలు తింటే అంత మేలా?

Dry Fruits: పెరుగులో డ్రై ఫ్రూట్స్ కలిపి పిల్లలకు ఇవ్వడం చేస్తే?

తర్వాతి కథనం
Show comments