Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి సేవలో నారా లోకేశ్ - రేపటి నుంచి పాదయాత్ర

Webdunia
గురువారం, 26 జనవరి 2023 (10:45 IST)
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ గురువారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. ఇందుకోసం ఆయన బుధవారం రాత్రికే తిరుమల క్షేత్రానికి చేరుకుని, గురువారం ఉదయం స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆయన రాకతో తిరుమల, తిరుపతిలో టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహంతో పాటు కోలాహలం నెలకొంది. 
 
తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తిరుమల స్వామివారిని దర్శనం తర్వాత కుప్పం చేరుకుని రాత్రికి ఆర్ అండ్ బి అతిథి గృహంలో బస చేస్తారు. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు కుప్పం మున్సిపాలిటీ లక్ష్మీపురం నుంచి వరదరాజులు దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత తాను యువగళం పేరుతో చేపట్టిన పాదయాత్రను ప్రారంభిస్తారు. 
 
ఇందులోభాగంగా, కమతమూరు రోడ్డులో నిర్వహించే బహిరంగసభలో ఆయన పాల్గొంటారు. ఆ తర్వాత గుడుపల్లె మండలం శెట్టిపల్లికి చేరుకుంటారు. రాత్రికి పీఈఎస్ మెడక్ల కాలేజీ ఎదుట ఉన్న ఓ ప్రైవేటు స్థలంలో లోకే‌శ్ బస చేస్తారు. రెండో రోజు అక్కడ నుంచి ఆయన శాంతిపురం మండలంలోకి ప్రవేశిస్తారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments