Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి సేవలో నారా లోకేశ్ - రేపటి నుంచి పాదయాత్ర

Webdunia
గురువారం, 26 జనవరి 2023 (10:45 IST)
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ గురువారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. ఇందుకోసం ఆయన బుధవారం రాత్రికే తిరుమల క్షేత్రానికి చేరుకుని, గురువారం ఉదయం స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆయన రాకతో తిరుమల, తిరుపతిలో టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహంతో పాటు కోలాహలం నెలకొంది. 
 
తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తిరుమల స్వామివారిని దర్శనం తర్వాత కుప్పం చేరుకుని రాత్రికి ఆర్ అండ్ బి అతిథి గృహంలో బస చేస్తారు. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు కుప్పం మున్సిపాలిటీ లక్ష్మీపురం నుంచి వరదరాజులు దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత తాను యువగళం పేరుతో చేపట్టిన పాదయాత్రను ప్రారంభిస్తారు. 
 
ఇందులోభాగంగా, కమతమూరు రోడ్డులో నిర్వహించే బహిరంగసభలో ఆయన పాల్గొంటారు. ఆ తర్వాత గుడుపల్లె మండలం శెట్టిపల్లికి చేరుకుంటారు. రాత్రికి పీఈఎస్ మెడక్ల కాలేజీ ఎదుట ఉన్న ఓ ప్రైవేటు స్థలంలో లోకే‌శ్ బస చేస్తారు. రెండో రోజు అక్కడ నుంచి ఆయన శాంతిపురం మండలంలోకి ప్రవేశిస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

పెళ్లంటూ చేసుకుంటే విడాకులు తీసుకోకూడదు.. జీవితాంతం వుండాలి: త్రిష

సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ గ్లింప్స్ రిలీజ్

Samantha: శుభం చిత్ర బృందంతో శ్రీవారిని దర్శించుకున్న హీరోయిన్ సమంత (video)

మలయాళ సినిమా జింఖానా ట్రైలర్‌ కు అనిల్ రావిపూడి ప్రమోషన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments