Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాలుగు ఓట్లు సంపాదించలేనివాడు కూడా.. కేశినేని నాని ట్వీట్ల కలకలం

Webdunia
ఆదివారం, 14 జులై 2019 (10:57 IST)
తెలుగుదేశం పార్టీకి చెందిన విజయవాడ ఎంపీ కేశినేని నాని ఇపుడు సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్‌గా ఉంటున్నారు. ముఖ్యంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయినప్పటి నుంచి ఆయన సోషల్ మీడియా వేదికగా తన మనసులోని విషయాలను బహిర్గతం చేస్తున్నాడు. 
 
తాజాగా ఆయన చేసిన ట్వీట్లు ఇపుడు టీడీపీలోనే కాదు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపాయి. "నాలుగు ఓట్లు సంపాదించలేని వాడు… నాలుగు పదవులు సంపాదిస్తున్నాడు. నాలుగు పదాలు చదవలేని వాడు... నాలుగు వాక్యాలు రాయలేనివాడు ట్వీట్‌ చేస్తున్నాడు" అంటూ నాని ట్వీట్‌లో పేర్కొన్నాడు.
 
అధికారం కోల్పోయిన తర్వాత పలువురు నేతలు టీడీపీకి రాజీనామా చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో కృష్ణా జిల్లా నేతలు మాత్రం ఒకరిపై ఒకరు టార్గెట్ చేసుకోవడం టీడీపీలో తీవ్ర దుమారాన్ని రేపుతోంది. ఇప్పటికే పార్టీ అధినాయకత్వంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. 
 
ముఖ్యంగా, విజయవాడ ఎంపీ కేశినేని నాని తన అసంతృప్తిని ట్విట్టర్ వేదికగా బయటపెడుతుండటం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. ఇటీవల టీడీపీలో షో మ్యాన్‌లు అవసరం లేదంటూ నాని వ్యాఖ్యానించి కలకలంరేపారు. తాజాగా ఆయన చేసిన ట్వీట్.. టీడీపీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేశ్‌ను ఉద్దేశించి చేసినవై ఉంటాయని పలువురు చర్చించుకుంటున్నారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments