Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జగన్ చెప్పింది అక్షరాలా నిజం.. కేసీఆర్ ది ఔదార్యం కాబట్టే...: కేశినేని నాని

Advertiesment
జగన్ చెప్పింది అక్షరాలా నిజం.. కేసీఆర్ ది ఔదార్యం కాబట్టే...: కేశినేని నాని
, శనివారం, 13 జులై 2019 (06:49 IST)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌పై టీడీపీ ఎంపీ కేశినేని నాని సెటైర్లు వేశారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో గోదావరి జలాల విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌ది ఔదార్యం అన్న వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చారు. 
 
మీరు చెప్పింది అక్షరాలా నిజం జగన్ అంటూ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. కేసీఆర్‌కు అంత ఔదార్యం ఉండబట్టే కదా ఎన్నికలలో మీకు అంత సాయం చేశారంటూ ఆరోపించారు. అందుకు సంబంధించి ఒక న్యూస్ పేపర్ క్లిప్‌ను పొందుపరిచారు. 
 
ఇకపోతే అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణ సీఎం కేసీఆర్‌పై ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రసంశల వర్షం కురిపించిన విషయం తెల్సిందే. తెలంగాణ సీఎం కేసీఆర్ ది ఔదార్యం అంటూ కితాబిచ్చారు. గోదావరి జలాలు ఇస్తున్నారంటూ ప్రశంసించారు. 
 
ఏపీ భూభాగం నుంచి కాకుండా తెలంగాణ నుంచే గోదావరి జలాలు వస్తున్నాయని అలాంటి సమయాల్లో సంతోషించాల్సింది పోయి విమర్శలా అంటూ నిప్పులు చెరిగారు. జగన్ వ్యాఖ్యలకు ఎంపీ కేశినేని నాని ఈ విధంగా కౌంటర్ ఇచ్చారు.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మాటలకు చేతలకు పొంతనే కాదు ముందుచూపు లేని బడ్జెట్ ‌: చంద్రబాబు