Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీడీపీ నేత పట్టాభికి రిమాండ్ - మచిలీపట్నం జైలుకు తరలింపు

Webdunia
గురువారం, 21 అక్టోబరు 2021 (19:14 IST)
టీడీపీ సీనియర్ నేత, అధికార ప్రతినిధి పట్టాభికి విజయవాడ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆయన్ను జైలుకు తరలించారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని దూషించారన్న ఆరోపణల నేపథ్యంలో పట్టాభిపై పోలీసులు కేసు నమోదు చేి అరెస్టు చేసిన విషయం తెల్సిందే. 
 
ఆయన్ను గురువారం ఉదయం విజయవాడ మూడవ అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ ఎదుట హాజరుపరిచారు. దాంతో ఆయనకు వచ్చే నెల 2 వరకు రిమాండ్ విధించారు. దాంతో పట్టాభిని పోలీసులు మచిలీపట్నం జైలుకు తరలించారు. 
 
ఇదిలావుంటే, పట్టాభి తరపున న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే ఆయన ఇంటిపై పలుమార్లు దాడి పాల్పడ్డారని పట్టాభి తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. సీఎంనిగానీ, ప్రభుత్వంలో ఉన్న వారినిగానీ వ్యక్తిగతంగా విమర్శించ లేదని పేర్కొన్నారు. 
 
కేవలం ప్రభుత్వంలో ఉన్న లోపాలను మాత్రమే మీడియాలో ప్రస్తావించారంటూ న్యాయమూర్తికి పట్టాభి తరపు న్యాయవాదులు వివరించారు. తనకు, తన కుటుంబానికి ప్రాణ హాని ఉందని న్యాయమూర్తికి తెలిపారు. దీనిపై త్వరలోనే విచారణ జరుగనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments