Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీడీపీ నేత పట్టాభికి రిమాండ్ - మచిలీపట్నం జైలుకు తరలింపు

Webdunia
గురువారం, 21 అక్టోబరు 2021 (19:14 IST)
టీడీపీ సీనియర్ నేత, అధికార ప్రతినిధి పట్టాభికి విజయవాడ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆయన్ను జైలుకు తరలించారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని దూషించారన్న ఆరోపణల నేపథ్యంలో పట్టాభిపై పోలీసులు కేసు నమోదు చేి అరెస్టు చేసిన విషయం తెల్సిందే. 
 
ఆయన్ను గురువారం ఉదయం విజయవాడ మూడవ అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ ఎదుట హాజరుపరిచారు. దాంతో ఆయనకు వచ్చే నెల 2 వరకు రిమాండ్ విధించారు. దాంతో పట్టాభిని పోలీసులు మచిలీపట్నం జైలుకు తరలించారు. 
 
ఇదిలావుంటే, పట్టాభి తరపున న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే ఆయన ఇంటిపై పలుమార్లు దాడి పాల్పడ్డారని పట్టాభి తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. సీఎంనిగానీ, ప్రభుత్వంలో ఉన్న వారినిగానీ వ్యక్తిగతంగా విమర్శించ లేదని పేర్కొన్నారు. 
 
కేవలం ప్రభుత్వంలో ఉన్న లోపాలను మాత్రమే మీడియాలో ప్రస్తావించారంటూ న్యాయమూర్తికి పట్టాభి తరపు న్యాయవాదులు వివరించారు. తనకు, తన కుటుంబానికి ప్రాణ హాని ఉందని న్యాయమూర్తికి తెలిపారు. దీనిపై త్వరలోనే విచారణ జరుగనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వేగేశ్న కార్తీక్‌ను పెళ్లాడిన నటి అభినయ.. ఫోటోలు వైరల్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

పుష్పక విమానం టాకీ అయితే అది సారంగపాణి జాతకం : వెన్నెల కిషోర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments