Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీడీపీది పిచ్చి తుగ్లక్‌ యాత్ర: లక్ష్మీపార్వతి

Webdunia
గురువారం, 20 ఫిబ్రవరి 2020 (09:07 IST)
టీడీపీది పిచ్చి తుగ్లక్‌ యాత్ర అంటూ వైసీపీ నేత లక్ష్మీపార్వతి విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రచారం ఎప్పుడూ చూడలేదన్నారు.

డిపాజిట్లు కూడా రావనే చంద్రబాబు ప్రచారానికి వెళ్తున్నారని ఎద్దేవా చేశారు. ఐటీ దాడుల్లో అక్రమాస్తులు బయటపడుతుంటే.. చంద్రబాబు, లోకేష్‌కు దిక్కుతోచడం లేదని ఆరోపించారు.

టీడీపీ అధ్యక్షుడిగా చంద్రబాబు పనికిరారని... సమర్థులైన వారిని ఎన్నుకోవాలని ఆ పార్టీ నేతలే సూచిస్తున్నారన్నారు. చంద్రబాబు పాలన బాగుంటే అమరావతిలో ఎందుకు ఓడారు? అని ప్రశ్నించారు.
 
ఇలాంటి ఆరోపణలు టీడీపీ నేతలకు అలవాటు
తనకు భద్రత తగ్గించారని ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న ఆరోపణలపై రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత స్పందించారు.

చంద్రబాబు భద్రతలో ఎలాంటి మార్పులు చేయలేదని, ఒక్కరిని కూడా తగ్గించలేదని స్పష్టం చేశారు. ఆర్నెళ్లకొకసారి ఇలాంటి ఆరోపణలు చేయటం టీడీపీ నేతలకు అలవాటుగా మారిందని విమర్శించారు.

ప్రజల్లో సానుభూతి కోసం ఇలాంటి చవకబారు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు తన వ్యక్తిగత మాజీ కార్యదర్శి ఇంట్లో జరిగిన ఆదాయపన్ను శాఖ జరిపిన సోదాల గురించి మాట్లాడరు గానీ ఇలాంటి ఆరోపణలు మాత్రం చేస్తుంటారని చురక అంటించారు. చంద్రబాబు కోరితే ఆయనకు మరింత భద్రతను పెంచటానికి సిద్ధమని హోంమంత్రి ప్రకటించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments