Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ ఉద్యోగులు ఆందోళన చెందొద్దు.. త్వరలోనే పీఆర్సీ

Webdunia
గురువారం, 20 ఫిబ్రవరి 2020 (09:01 IST)
వేతన సవరణ కమిషన్ గడువు పెంపుతో ఉద్యోగులు ఆందోళన చెందొద్దన్నారు ఉద్యోగ సంఘాల ఐకాస అధ్యక్షుడు కారం రవీందర్ రెడ్డి. త్వరలోనే పీఆర్సీ వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

పీఆర్సీ కమిషన్ గడువు పెంపు నేపథ్యంలో తెలంగాణ ఉద్యోగ సంఘాల ఐకాస నేతలు బీఆర్కే భవన్​లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్​ కుమార్​ను కలిశారు.

పీఆర్సీ ఇవ్వడమే కాకుండాఉద్యోగుల సమస్యలు త్వరగా పరిష్కరించాలని కోరినట్లు ఉద్యోగ సంఘాల ఐకాస అధ్యక్షుడు కారం రవీందర్ రెడ్డి తెలిపారు. కమిషన్ గడువు పెంపుతో ఉద్యోగులు ఆందోళన చెందిన విషయాన్ని సీఎస్ దృష్టికి తీసుకెళ్లమన్నారు.

ఉద్యోగులకు సంబంధించిన అనేక ఇతర విషయాలపై అధ్యయనం కోసమే వేతన సవరణ కమిషన్ ఏర్పాటు చేశారని... పీఆర్సీ నివేదిక కూడా సిద్ధంగా ఉందని రవీందర్​ రెడ్డి తెలిపారు. త్వరలోనే పీఆర్సీ వస్తుందని సీఎస్ సోమేశ్​ కుమార్ కూడా చెప్పారని ఆయన పేర్కొన్నారు.

ప్రభుత్వ ఉద్యోగుల పక్షాన ఉన్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ అనేకమార్లు చెప్పారని గుర్తుచేశారు. త్వరలోనే ఉద్యోగసంఘాలను పిలిచి సీఎం మాట్లాడతారని, గౌరవప్రదమైన పీఆర్సీ వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

సమస్యలపై సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందిస్తారన్న నమ్మకం ఉందని... ఒకవేల పీఆర్సీ ప్రకటించపోతే పోరాటం చేస్తామన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments