Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ ఉద్యోగులు ఆందోళన చెందొద్దు.. త్వరలోనే పీఆర్సీ

Webdunia
గురువారం, 20 ఫిబ్రవరి 2020 (09:01 IST)
వేతన సవరణ కమిషన్ గడువు పెంపుతో ఉద్యోగులు ఆందోళన చెందొద్దన్నారు ఉద్యోగ సంఘాల ఐకాస అధ్యక్షుడు కారం రవీందర్ రెడ్డి. త్వరలోనే పీఆర్సీ వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

పీఆర్సీ కమిషన్ గడువు పెంపు నేపథ్యంలో తెలంగాణ ఉద్యోగ సంఘాల ఐకాస నేతలు బీఆర్కే భవన్​లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్​ కుమార్​ను కలిశారు.

పీఆర్సీ ఇవ్వడమే కాకుండాఉద్యోగుల సమస్యలు త్వరగా పరిష్కరించాలని కోరినట్లు ఉద్యోగ సంఘాల ఐకాస అధ్యక్షుడు కారం రవీందర్ రెడ్డి తెలిపారు. కమిషన్ గడువు పెంపుతో ఉద్యోగులు ఆందోళన చెందిన విషయాన్ని సీఎస్ దృష్టికి తీసుకెళ్లమన్నారు.

ఉద్యోగులకు సంబంధించిన అనేక ఇతర విషయాలపై అధ్యయనం కోసమే వేతన సవరణ కమిషన్ ఏర్పాటు చేశారని... పీఆర్సీ నివేదిక కూడా సిద్ధంగా ఉందని రవీందర్​ రెడ్డి తెలిపారు. త్వరలోనే పీఆర్సీ వస్తుందని సీఎస్ సోమేశ్​ కుమార్ కూడా చెప్పారని ఆయన పేర్కొన్నారు.

ప్రభుత్వ ఉద్యోగుల పక్షాన ఉన్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ అనేకమార్లు చెప్పారని గుర్తుచేశారు. త్వరలోనే ఉద్యోగసంఘాలను పిలిచి సీఎం మాట్లాడతారని, గౌరవప్రదమైన పీఆర్సీ వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

సమస్యలపై సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందిస్తారన్న నమ్మకం ఉందని... ఒకవేల పీఆర్సీ ప్రకటించపోతే పోరాటం చేస్తామన్నారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments