Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్డీయేతో ఎందుకు తెగదెంపులు చేసుకున్నామంటే : చంద్రబాబు

భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్డీయే కూటమితో తెగదెంపులు చేసుకోవడానికి గల కారణాలను ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన ట్విట్టర్ ఖాతాలో వివరణ ఇచ్చారు.

Webdunia
శుక్రవారం, 16 మార్చి 2018 (14:43 IST)
భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్డీయే కూటమితో తెగదెంపులు చేసుకోవడానికి గల కారణాలను ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన ట్విట్టర్ ఖాతాలో వివరణ ఇచ్చారు. 
 
ఆంధ్రప్రదేశ్ హక్కులను కాలరాసి ఐదు కోట్ల ఆంధ్రులకు అన్యాయం చేసిన ఎన్డీయే కూటమి నుంచి నేడు వైదొలుగుతున్నాం. టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశంలో చర్చించి ఈ మేరకు ఏకగ్రీవ నిర్ణయ తీసుకున్నాం అంటూ ఆయన తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు.
 
ఇదే అంశాన్ని ఆయన శుక్రవారం అసెంబ్లీ సమావేశంలోనూ స్పష్టంచేశారు. ఏపీ ప్రయోజనాల కోసమే ఎన్డీయే నుంచి బయటికొచ్చినట్లు అసెంబ్లీలో చెప్పారు. రాష్ట్రం కోసమే కఠిన నిర్ణయం తీసుకున్నామన్నారు. మన నిర్ణయంపై బీజేపీ ఆత్మవిమర్శ చేసుకోవాలని అభిప్రాయపడ్డారు. 
 
రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏ విషయంలోనూ రాజీ పడేది లేదని ఆయన మరోసారి స్పష్టంచేశారు. ఏపీ కష్టాలను కేంద్రం పట్టించుకోలేదని, నాలుగు బడ్జెట్‌లలోనూ ఏపీకి అన్యాయం చేశారని చంద్రబాబు ఆవేదన వ్యక్తంచేశారు.
 
ప్రత్యేక హోదా ఏపీ ప్రజల హక్కు అని అన్నారు. విభజన హామీ మేరకు ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వరని ఆయన నిలదీశారు. పైగా, 14వ ఆర్థిక సంఘం ఇవ్వొద్దని చెప్పిందని అసత్య ప్రచారం చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ప్రత్యేక హోదా ఇవ్వొద్దని తాము చెప్పలేదనీ ఆర్థిక సంఘం సభ్యులే స్పష్టం చేశారని చంద్రబాబు గుర్తుచేశారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' రిలీజ్‌కు ముందు మంచు విష్ణుకు షాకిచ్చిన జీఎస్టీ అధికారులు

డబ్బుల కోసం సినిమాలు చేయాలని లేదు, కన్నప్ప లో ప్రభాస్, విష్ణు పాత్రలు హైలైట్ : శివ బాలాజీ

ఎంటర్టైన్మెంట్, లవ్ స్టోరీ వర్జిన్ బాయ్స్ కి సెన్సార్ నుండి ఏ సర్టిఫికెట్

శ్రీశైలం దర్శనంతో ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ముగించిన మంచు విష్ణు

Kannappa first review : మంచు విష్ణు చిత్రం కన్నప్ప ఫస్ట్ రివ్యూ చెప్పేసిన నటుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

దివ్యాంగ విద్యార్ధుల కోసం నాట్స్ ఉచిత బస్సు, విశాఖలో బస్సును లాంఛనంగా ప్రారంభించిన ఎంపీ భరత్

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

ఓరల్ యాంటీ-డయాబెటిక్ మందులను పంపిణీకి అబాట్- ఎంఎస్‌డి వ్యూహాత్మక భాగస్వామ్యం

తర్వాతి కథనం
Show comments