Webdunia - Bharat's app for daily news and videos

Install App

బూతుల మంత్రితో పోటీపడుతున్న కొబ్బరిచిప్పల మంత్రి....

Webdunia
బుధవారం, 22 డిశెంబరు 2021 (14:53 IST)
విజ‌య‌న‌గ‌రం రామతీర్థం రాముని సాక్షిగా వైసీపీ అరాచకం బట్టబయలైంద‌ని, వీధి రౌడీల్లా అశోక్ గజపతిరాజుపై మంత్రులు దాడికి తెగించార‌ని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. వీధి రౌడీల్లా అశోక్ గజపతిరాజుపై మంత్రులు దాడికి తెగించార‌ని, మంత్రులు చర్యను తీవ్రంగా ఖండిస్తున్నా అని చెప్పారు.
 
 
దేవాలయాల్లో పాటించాల్సిన ఆనవాయితీని ప్రశ్నిస్తే దాడులు చేసే సంస్కృతికి వైసీపీ ప్రభుత్వం దిగజారింద‌ని చంద్ర‌బాబు విమ‌ర్శించారు. రామతీర్థం ఆలయ కమిటీ ధర్మకర్తగా ఉన్న అశోక్ గజపతిరాజు పేరు లేకుండా కార్యక్రమాలు ఎలా నిర్వహిస్తార‌ని అయ‌న ప్ర‌శ్నించారు. వేల ఎకరాలను దానం చేసిన కుటుంబానికి ఇచ్చే గౌరవం ఇదేనా? కనీసం ప్రోటోకాల్ నిర్వహించాలన్న బుద్ధి ఈ ప్రభుత్వ పెద్దలకు లేదా? అని నిల‌దీశారు.
 
 
వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి అశోక్ గజపతిరాజుపై కక్షగట్టార‌ని, మాన్సాన్ ట్రస్టు చైర్మన్ గా తొలగించి, ట్ర‌స్ట్ భూములు దోచుకోవాలని చూశార‌న్నారు. రామతీర్థం దేవాలయ నిర్మాణానికి అశోక్ గజపతిరాజు విరాళం ఇస్తే ఎందుకు తీసుకోలేద‌ని ప్ర‌శ్నించారు. భక్తితో ఇచ్చిన వాటిని నిరాకరించే హక్కు మీకు ఎవరిచ్చారు? రామతీర్థంలో రాముడి తల తొలగించి ఏడాది గడుస్తున్నా, ఇప్పటికీ నిందితులను పట్టుకోలేద‌ని ఆరోపించారు. బూతుల మంత్రితో పోటీపడి కొబ్బరిచిప్పల మంత్రి చిన్నాపెద్ద లేకుండా నోరుపారేసుకుంటున్నార‌ని అన్నారు. మీ అరాచక, దుర్మార్గాలు ఎల్లకాలం సాగవు అంటూ చంద్ర‌బాబు హెచ్చ‌రించారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments