Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోడ్డుపై ప‌డుకున్నటీడీపీ నాయ‌కురాలు గుమ్మడి సంధ్యారాణి

Webdunia
బుధవారం, 20 అక్టోబరు 2021 (10:40 IST)
విజయనగరం జిల్లా సాలూరు టీడీపీ నాయకురాలు గుమ్మ‌డి సంధ్యారాణి రోడ్డుపై ప‌డుకుని త‌న నిర‌స‌న తెలిపారు. టీడీపీ కార్యాల‌యంపై దాడికి నిరసనగా ప్ర‌ద‌ర్శ‌న చేసేందుకు సాలూరు టీడీపీ నాయ‌కులు రోడ్డ‌పైకి రాగా, వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీనితో కాసేపు సాలూరు పోలీసుల‌కు, టీడీపీ నాయకులకు మధ్య తోపులాట జ‌రిగింది.
 
నిర‌స‌న తెలిపే స్వాతంత్రం కూడా మాకు లేదా అంటూ సాలూరు నాయ‌కురాలు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు గుమ్మడి సంధ్యారాణి రోడ్డుపై ప‌డుకున్నారు. ఆమెతోపాటు పలువురు మ‌హిళా నేత‌లు, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆర్.పి.బంజ్ దేవ్ నిర‌స‌న తెలిపారు. దీనితో వారిని అరెస్ట్ చేసేందుకు యత్నించిన పోలీసుల‌కు, నాయ‌కుల‌కు మ‌ద్య తీవ్ర వాగ్వాదం జ‌రిగింది. 
 
సాలూరులో ప‌రిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసుల తీరను నిరసిస్తూ రోడ్డు మీద పడుకొని నిరసన తెలిపిన గుమ్మడి సంధ్యారాణిని వారించేస‌రికి పోలీసులు త‌ల ప్రాణం తోక‌కు వ‌చ్చింది. చివ‌రికి పోలీసులు బల‌వంతంగా సంధ్యారాణిని రోడ్డుపై నుంచి లేపి అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ వైపు మళ్లిన హీరోయిన్.. మృణాల్ ఠాకూర్ వర్సెస్ శ్రీలీల

మా నాన్న కూడా ఇంత ఖర్చు పెట్టి సినిమా తీయలేదు : బడ్డీ మూవీ హీరో అల్లు శిరీష్

ఆది సాయికుమార్ విజువ‌ల్ వండ‌ర్ ష‌ణ్ముఖ షూటింగ్ పూర్తి

థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో 1000 వాలా టీజర్ వచ్చేసింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం
Show comments