Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోడ్డుపై ప‌డుకున్నటీడీపీ నాయ‌కురాలు గుమ్మడి సంధ్యారాణి

Webdunia
బుధవారం, 20 అక్టోబరు 2021 (10:40 IST)
విజయనగరం జిల్లా సాలూరు టీడీపీ నాయకురాలు గుమ్మ‌డి సంధ్యారాణి రోడ్డుపై ప‌డుకుని త‌న నిర‌స‌న తెలిపారు. టీడీపీ కార్యాల‌యంపై దాడికి నిరసనగా ప్ర‌ద‌ర్శ‌న చేసేందుకు సాలూరు టీడీపీ నాయ‌కులు రోడ్డ‌పైకి రాగా, వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీనితో కాసేపు సాలూరు పోలీసుల‌కు, టీడీపీ నాయకులకు మధ్య తోపులాట జ‌రిగింది.
 
నిర‌స‌న తెలిపే స్వాతంత్రం కూడా మాకు లేదా అంటూ సాలూరు నాయ‌కురాలు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు గుమ్మడి సంధ్యారాణి రోడ్డుపై ప‌డుకున్నారు. ఆమెతోపాటు పలువురు మ‌హిళా నేత‌లు, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆర్.పి.బంజ్ దేవ్ నిర‌స‌న తెలిపారు. దీనితో వారిని అరెస్ట్ చేసేందుకు యత్నించిన పోలీసుల‌కు, నాయ‌కుల‌కు మ‌ద్య తీవ్ర వాగ్వాదం జ‌రిగింది. 
 
సాలూరులో ప‌రిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసుల తీరను నిరసిస్తూ రోడ్డు మీద పడుకొని నిరసన తెలిపిన గుమ్మడి సంధ్యారాణిని వారించేస‌రికి పోలీసులు త‌ల ప్రాణం తోక‌కు వ‌చ్చింది. చివ‌రికి పోలీసులు బల‌వంతంగా సంధ్యారాణిని రోడ్డుపై నుంచి లేపి అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram: రామ్, ఉపేంద్ర, సత్య పై రాజమండ్రిలో ఆంధ్రా కింగ్ తాలూకా షెడ్యూల్

తరుణ్ భాస్కర్, సురేష్ ప్రొడక్షన్స్, కల్ట్ సీక్వెల్ ENE రిపీట్ అనౌన్స్‌మెంట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments