రోజాను ఓడించేందుకు ఆమెను రంగంలోకి దించుతున్న చంద్రబాబు.. ఎవరు?

Webdunia
మంగళవారం, 26 ఫిబ్రవరి 2019 (19:47 IST)
వైసీపీ ఎమ్మెల్యే, సినీ నటి రోజాను నగరిలో ఓడించే అంశంపై కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టారు చంద్రబాబు. ఈసారి గాలి ముద్దుకృష్ణమ నాయుడు కుటుంబానికి టికెట్ ఇస్తారా లేక కొత్తవారిని తెరపైకి తీసుకొస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. మరోసారి ఏపీలో అధికారం దక్కించుకోవాలని పట్టుదలగా ఉన్న ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు... ఇందుకోసం తనదైన వ్యూహాలను అమలు చేస్తున్నారు. 
 
అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్న టీడీపీ... అభ్యర్థుల ఎంపిక విషయంలోనూ అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటోంది. నియోజకవర్గంలో ఎవరికి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే దానిపై ప్రత్యేకంగా సర్వేలు కూడా చేయించుకుంటోంది. మిగతా అభ్యర్థుల సంగతి ఎలా ఉన్నా... వైసీపీలో ఉంటూ తనను ఎక్కువగా టార్గెట్ చేసే నేతలను ఈసారి ఎలాగైనా ఓడించాలని భావిస్తున్న చంద్రబాబు... వైసీపీ ఎమ్మెల్యే, సినీ నటి రోజాను ఓడించే అంశంపై కూడా ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టారని టాక్ వినిపిస్తోంది.
 
ముద్దుక్రిష్ణమనాయుడు మరణం కారణంగా ఈసారి నగరి టీడీపీ సీటును ఆయన ఇద్దరి కుమారుల్లో ఒకరికి ఇచ్చే అవకాశం ఉందని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే తాజాగా నగరి నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున డాక్టర్ సుభాషిణి పోటీలో నిలిచే అవకాశం ఉందనే ప్రచారం కూడా జరుగుతోంది. 
 
క్షత్రియ సామాజికవర్గానికి చెందిన సుభాషిణి, ఆమె భర్త ఇద్దరూ డాక్టర్లే కావడం... నియోజకవర్గంలో వారికి మంచి పేరు ఉండటం కూడా వారికి కలిసొస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే గాలి ముద్దుకృష్ణమనాయుడు సతీమణికి ఎమ్మెల్సీ పదవి ఉండటంతో... కొత్తవారికి అవకాశం ఇస్తారనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తానికి వైసీపీ తరపున టీడీపీని, చంద్రబాబును టార్గెట్ చేయడంలో ముందుండే రోజాను ఓడించేందుకు అధికార పార్టీ ఏవిధంగా ముందుకు వెళుతుందో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments