Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్యానుకి ఓటేస్తే ఇంట్లో ఉన్న ఫ్యాన్ ఆగిపోయింది!

Webdunia
శనివారం, 16 అక్టోబరు 2021 (12:35 IST)
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విట్ట‌ర్ వేదిక‌గా త‌న వాడి వేడి కామెంట్ల‌ను సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిపై విసురుతూనే ఉన్నారు. ప్ర‌తి అంశంపై ఆయ‌న ట్విట్ట‌ర్ లో వ్యాఖ్య‌లు చేయ‌డం మాన‌డం లేదు. ఇపుడు తాజాగా లోకేష్ ప‌వ‌ర్ క‌ట్ ల‌పై త‌న‌దైన శైలిలో కామెంట్స్ చేశారు.
 
రాష్ట్రాన్ని అంధకారాంధ్రప్రదేశ్ గా మార్చేసారు జగన్ రెడ్డి. ఫ్యానుకి ఓటేస్తే ఇంట్లో ఉన్న ఫ్యాన్ ఆగిపోయింది. ఒక పక్క విద్యుత్ ఛార్జీల పెంపు పేరుతో బాదుడే బాదుడు. మరోపక్క విద్యుత్ కోతలతో అంధకారం. బొగ్గు కొరత ఏర్పడుతుంది జాగ్రత్త పడండని 40 రోజుల ముందే కేంద్రం హెచ్చరించినా తాడేపల్లి ప్యాలస్ లో నిద్రపోతున్న జగన్ రెడ్డిలో చలనం లేదు. రూ.200 కోట్లకు పైగా సొంత మీడియాకి ప్రకటనల రూపంలో దోచిపెట్టిన మీరు, బొగ్గు ఉత్పత్తి సంస్థలకు చెల్లించాల్సిన రూ.215 కోట్ల బకాయిలని చెల్లించకపోవడం దారుణం. అవసరం మేర బొగ్గు నిల్వ చేసుకోవాలన్న కేంద్రం హెచ్చరికల్ని పెడచెవిన పెట్టి అవినీతి సొమ్ము నిల్వ చేసుకోవడంలో జగన్ రెడ్డి బిజీ అవ్వడం వలనే రాష్ట్రానికి ఈ దుస్థితి వచ్చింది. అంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్వీట్ చేశారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments