Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూడు రాజధానులను వ్యతిరేకిస్తున్నా : డొక్కా మాణిక్యవరప్రసాద్ రాజీనామా

Webdunia
మంగళవారం, 21 జనవరి 2020 (11:55 IST)
మూడు రాజధానుల ఏర్పాటును తాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు టీడీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ తెలిపారు. ఇందుకు నిరసన తెలిపే చర్యల్లో భాగంగా తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. పైగా, తన రాజీనామా లేఖను టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు పంపించారు. భవిష్యత్తులో ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయబోనని ప్రకటించారు. 
 
ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి సర్కారు సోమవారం అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింపజేసింది. ఇదే బిల్లును మంగళవారం శాసనసభలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లుపై నిబంధన 71 ప్రకారం చర్చకు టీడీపీ పట్టుబట్టింది. దీంతో చర్చ ఏ విధంగా సాగాలన్న అంశంపై మండలి ఛైర్మన్ తన చాంబర్‌లో అధికార, విపక్ష సభ్యులతో చర్చలు జరుపుతున్నారు.
 
ఇంతలోనే డొక్కా మాణిక్యవరప్రసాద్ తన పదవికి రాజీనామా చేశారు. పైగా, ఆయన మంగళవారం సభకు కూడా రాలేదు. ఆయనతో పాటు.. మరో ఎమ్మెల్సీ శమంతకమణి కూడా మంగళవారం సభకు హాజరుకాలేదు. దీంతో ఆమె కూడా రాజీనామా చేసిందనే ప్రచారం సాగుతోంది. అయితే, ఈ బిల్లుపై మండలిలో చర్చ చేపట్టడానికి ముందే డొక్కా రాజీనామా చేయడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments