Webdunia - Bharat's app for daily news and videos

Install App

తినేది బీజేపీ కూడా.. పాడేది వైకాపా పాట : జీవీఎల్‌పై వర్ల విసుర్లు

Webdunia
శుక్రవారం, 7 ఫిబ్రవరి 2020 (16:00 IST)
భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహా రావుపై తెలుగుదేశం పార్టీ నేత వర్ల రామయ్య తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. జీవీఎల్.. తినేది బీజేపీ కూడు... పాడేది వైకాపా పాట అంటూ ఆరోపించారు. 
 
మూడు రాజధానులు ఉంటే తప్పేంటన్న జీవీఎల్ వ్యాఖ్యలకు వర్ల రామయ్య శుక్రవారం కౌంటరిచ్చారు. ఏపీ బీజేపీ వ్యవహారాల్లో జీవీఎల్ ఎందుకు జోక్యం చేసుకుంటున్నారని నిలదీశారు. జీవీఎల్ వైసీపీకి అనుకూలంగా మాట్లాడటంలో మతలబు ఏంటి? అని అన్నారు. జగన్‌ను జీవీఎల్ ఏకాంతంగా ఎందుకు కలిశారని సూటింగా ప్రశ్నించారు. రాష్ట్ర బీజేపీ శాఖకు తెలియకుండా జగన్‌ను కలవడంపై సమాధానం చెప్పాలని వర్ల డిమాండ్ చేశారు. 
 
ఇటీవల ఢిల్లీలోని లోథి హోటల్‌లో వైసీపీ ముఖ్య నేతను జీవీఎల్ ఎందుకు కలిశారని ప్రశ్నించారు. మూడు రాజధానులపై జీవీఎల్ కారుకూతలు కూయడం మానుకోవాలంటూ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. జీవీఎల్‌కు ధైర్యముంటే రాజధానిలో పర్యటించాలని సవాల్ విసిరారు. 
 
తినేదే బీజేపీ కూడు.. పాడేది వైసీపీ పాట అంటూ ధ్వజమెత్తారు. ఏపీ రాజధానిగా అమరావతి అంటూ బీజేపీ రాష్ట్ర శాఖ తీర్మానం చేసిన విషయం గుర్తు లేదా అని వర్ల రామయ్య నిలదీశారు. అలాంటపుడు మూడు రాజధానులు ఉంటే తప్పేంటని ఎలా అడుగుతారంటూ వర్ల ప్రశ్నించారు. 

సంబంధిత వార్తలు

రేవ్ పార్టీలు - ప‌బ్‌ల‌కు వెళ్లే వ్య‌క్తిని నేను కాదు.. త‌ప్పుడు క‌థ‌నాల‌ను న‌మ్మ‌కండి : న‌టుడు శ్రీకాంత్

బెంగుళూరు రేవ్ పార్టీ ఫామ్ హౌస్‌లోనే ఉన్న హేమ?? పట్టించిన దుస్తులు!

ముంబై స్టార్ స్పోర్ట్స్‌లో భార‌తీయుడు 2 ప్రమోషన్స్ షురూ

యాక్షన్ ఎంటర్టైనర్స్ గా శివ కంఠంనేని బిగ్ బ్రదర్ రాబోతుంది

రెండు పార్టులుగా ఫేస్తోన్న మిరాయ్ తో మళ్ళీ వెండితెరపైకి మనోజ్ మంచు

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments