Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జగన్ సీక్రెట్ ఏజెంటుగా జీవీఎల్ : సీపీఐ నారాయణ

Advertiesment
జగన్ సీక్రెట్ ఏజెంటుగా జీవీఎల్ : సీపీఐ నారాయణ
, శుక్రవారం, 7 ఫిబ్రవరి 2020 (08:24 IST)
బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహా రావుపై సీపీఐ జాతీయ కమిటీ సభ్యుడు కె. నారాయణ సంచలన ఆరోపణలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి సీక్రెట్ ఏజెంటుగా జీవీఎల్ నరసింహా రావు పని చేస్తున్నారంటూ మండిపడ్డారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహరావు, సీఎం జగన్‌కు ఏజెంట్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీకి, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు తెలియకుండా రాష్ట్రంలో ఏమీ జరగడం లేదు. బీజేపీ నాయకులు కేంద్రంలో ఒక నాటకం, రాష్ట్రంలో ఒక నాటకం ఆడుతున్నారంటూ మండిపడ్డారు. 
 
బీజేపీ, వైసీపీ కలిసి కాపురం చేస్తున్నామని బహిరంగంగానే ప్రకటించవచ్చు. ఈ డొంక తిరుగుడు నాటకాలు ఎందుకు? ఆ రెండు పార్టీలు లీగల్‌గా కాపురం చేస్తే ఎవరికీ అభ్యంతరం లేదని అన్నారు. అలాగే, హైకోర్టు ఎక్కడైనా పెట్టుకోండి, కానీ, సచివాలయం, అసెంబ్లీ ఒకేచోట ఉండాలని నారాయణ స్పష్టం చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సెలక్ట్ కమిటీ మెంబర్లు ఖరారు