Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిత్తూరును గంజాయివనంగా మార్చిన మంత్రి పెద్దిరెడ్డి : పంచుమర్తి అనురాధ

Webdunia
బుధవారం, 3 ఫిబ్రవరి 2021 (15:17 IST)
ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై టీడీపీ మహిళా నేత పంచుమర్తి అనురాధ ఘాటు వ్యాఖ్యలు చేశారు. చిత్తూరు జిల్లాను గంజాయివనంగా మార్చారంటూ మండిపడ్డారు. 
 
ఇదే అంశంపై ఆమె బుధవారం మీడియాతో మాట్లాడుతూ, తులసివనం లాంటి చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి కలుపుమొక్క అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చిత్తూరును పెద్దిరెడ్డి గంజాయివనంగా మార్చారని విమర్శించారు. 
 
పంచాయతీ ఎన్నికల్ని ఎదుర్కొనే సత్తా పెద్దిరెడ్డికి లేదన్న ఆమె, టీడీపీ హయాంలోని పంచాయతీ భవనాలకు వైసీపీ రంగులేస్తారా? అని ప్రశ్నించారు. మంత్రి పదవిలో ఉండి మహిళలను ఉద్దేశించి పెద్దిరెడ్డి అసభ్యంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 
 
అలాగే, మరో టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు మాట్లాడుతూ, ప్రజాబలం ఎదుర్కోలేక వందలమంది పోలీసులతో అచ్చెన్నాయుడిని అరెస్ట్ చెయ్యడం ప్రభుత్వ దుర్మార్గ చర్య అని మాజీ మంత్రి దేవినేని ఉమ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. అచ్చెన్నపై కక్ష సాధింపు చర్యలకు మూల్యం చెల్లించక తప్పదన్నారు. 
 
‘‘ప్రజాబలం ఎదుర్కోలేక వందలమంది పోలీసులతో అచ్చెన్నాయుడిని అరెస్ట్ చెయ్యడం ప్రభుత్వ దుర్మార్గ చర్య. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి భయంతో భయబ్రాంతులకు గురి చేయాలనే ఈ దుందుడుకు చర్యకు పాల్పడ్డారు. అచ్చెన్నపై కక్ష సాధింపు చర్యలకు మూల్యం చెల్లించక తప్పదు’’ అని దేవినేని ఉమ ట్వీట్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments