Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజకీయాలకు స్వస్తి చెప్పిన మాజీ ఎంపీ మురళీ మోహన్

Webdunia
సోమవారం, 25 జనవరి 2021 (10:32 IST)
ప్రముఖ నటుడు, మాజీ ఎంపీ మురళీమోహన్ రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. ఇకపై తనకు రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. అలాగే తన భవిష్యత్తు కార్యచరణ ఏమిటనే వివరాలను ఓ తెలుగు దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ప్రస్తుతం తన దృష్టి సినిమాలపైనే ఉందని మురళీమోహన్ తెలిపారు. తాను సినిమాల నుంచి ఎదిగిన వాడినని.. అందుకే దానిని మరిచిపోనని చెప్పారు. 
 
మళ్లీ సినిమా రంగంలో పూర్తిగా కనిపించనున్నట్టు వెల్లడించారు. తన వ్యాపారాలను తమ్ముడు, పిల్లలకు అప్పగించినట్టు తెలిపారు. ఇటీవల తనకు వెన్నెముక శస్త్ర చికిత్స జరిగింది.. ప్రస్తుతం దాన్ని నుంచి పూర్తిగా కోలుకున్నానని చెప్పారు. తన జయబేరి ఆర్ట్స్‌లో ఇప్పటివరకు 25 సినిమాలను నిర్మించామని తెలిపారు. అతడు తమ సంస్థ నుంచి వచ్చిన చివరి చిత్రమని.. ఆ తర్వాత రాజకీయాలు, వ్యాపారాల్లో బిజీ అయిపోవడంతో సినిమాలు నిర్మించలేకపోయామని చెప్పారు.
 
ప్రస్తుతం తన దృష్టి అంతా సినిమాలు నిర్మించడంతో పాటుగా నటనపైనే ఉందన్నారు. దాదాపు 10 ఏళ్ల విరామం తర్వాత మళ్లీ పూర్తి స్థాయి సినిమాల్లో నటిస్తున్నట్టు చెప్పారు. తాజాగా ఆర్కా మీడియా నిర్మిస్తున్న వెబ్ సిరీస్‌లో నటిస్తున్నట్టు చెప్పారు. అందులో జగపతిబాబు, శరత్‌ కుమార్‌ అన్నదమ్ములుగా నటిస్తున్నారని.. వారికి తండ్రి పాత్రలో తాను నటిస్తున్నట్టు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్ర‌భాస్ తో ఓ బాలీవుడ్ భామ‌ చేయనంటే.. మరో భామ గ్రీన్ సిగ్నల్ ?

UV క్రియేషన్స్ బ్రాండ్ కు చెడ్డపేరు తెస్తే సహించం

కల్ట్ క్లాసిక్‌లో చిరంజీవి, మహేష్ బాబు కలిసి అవకాశం పోయిందా !

రామాయణ: ది ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని PCX స్క్రీన్‌పై ప్రదర్శన

సినిమా పైరసీపై కఠిన చర్యలు తీసుకోబోతున్నాం : ఎఫ్.డి.సి చైర్మన్ దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

Breakfast: స్కూల్స్‌కు వెళ్లే పిల్లలు బ్రేక్ ఫాస్ట్ తీసుకోకపోతే.. ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments