ఏపీ సీఎం జగన్ వన్‌టైమ్ సీఎంగా మిగిలిపోతారు : లంకా దినకర్

Webdunia
మంగళవారం, 7 డిశెంబరు 2021 (14:00 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వన్ టైమ్ సెటిల్మెంట్ సీఎంగా మిగిలిపోవడం ఖాయమని టీడీపీ నేత లంకా దినకర్ జోస్యం చెప్పారు. కొన్ని దశాబ్దాలుగా నివసిస్తున్న ఇళ్లకు రిజిస్ట్రేషన్ ఫీజుగా రూ.10 వేల చొప్పున వన్ టైమ్ సెటిల్మెంట్ వసూలు చేయాలని ఏపీ సర్కారు నిర్ణయించింది. 
 
ఈ వ్యవహారంపై ఏపీలో రగడ కొనసాగుతోంది. వన్ టైమ్ సెటిల్మెంట్ స్కీమ్‌లో ఒకే మొత్తంలో రుణ బకాయిలు చెల్లించి జగనన్న సంపూర్ణ స్వగృహ పథకం ద్వారా లబ్దిదారులు ఇళ్ళపై పూర్తి హక్కులు పొందాలని ఏపీ సర్కారు ఆదేశాలు జారీచేసింది. దీనిపై విపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఓటీఎస్ పేరుతో పేద ప్రజలను మోసం చేస్తుందని వారు ఆరోపిస్తున్నారు. 
 
దీనిపై టీడీపీ నేత లంకా దినకర్ స్పందించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనలో అభివృద్ధి కంటే వ్యాపారం ఎక్కువై పోయిందని చెప్పారు. సంక్షేమం కూడా ప్రణాళికాబద్ధంగా లేదని ఆరోపించారు. పేద, మధ్యతరగతి వర్గాల పాత గృహ లబ్దిదారుల నుంచి కొత్త విధానాలతో డబ్బులు దండుకోవడంలో జగన్ స్పెషలిస్ట్‌గా మారారని, ఈయన కూడా ఓటీఎస్ ముఖ్యమంత్రిగా మారిపోతారని లంకా దినకర్ అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: 2025లో అత్యంత ప్రజాదరణగల తారలు, దర్శకులుగా రష్మిక మందన్నా, రిషబ్ శెట్టి ప్రకటించిన IMDb

Sholay 4K : సినీపోలిస్ ఇండియా స్వర్ణోత్సవాల కోసం షోలే 4K డిజిటల్‌ పెద్ద తెరపైకి

శ్రీలంకకు మానవతా సాయం... కాలం చెల్లిన ఆహారాన్ని పంపిన పాకిస్థాన్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

Sri Nandu: డెమో లాగా సైక్ సిద్ధార్థ షూట్ చేస్తే ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది : శ్రీ నందు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments