Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమ్మినేని సీతారాం అంత పని చేశారా? టీడీపీ నేత సంచలన ఆరోపణలు

Webdunia
మంగళవారం, 28 మార్చి 2023 (07:50 IST)
ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై టీడీపీ నేత కూన రవికుమార్ సంచలన ఆరోపణలు చేశారు. తమ్మినేని సీతారాం నకిలీ డిగ్రీ సర్టిఫికేట్‌తో లా అడ్మిషన్ తీసుకున్నారంటా ఆయన ఆరోపించారు. పైగా, తాను డిగ్రీ పూర్తి చేయలేదని గతంలో తమ్మినేని స్వయంగా చెప్పారని తెలిపారు. ఎన్నికల అఫిడవిట్‌లోనూ ఇదేవిషయాన్ని గుర్తుచేశారని, అందువల్ల ఆయనపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇదే విషయంపై రాష్ట్రపతితో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ గవర్నర్లు, ఏపీ హైకోర్టు సీజే, సీఎం జగన్‌లకు ఆయన లేఖలు రాశారు. 
 
తమ్మినేని సీతారాం స్పీకర్ అయిన తర్వాత హైదరాబాద్ ఎల్బీ నగర్‌లోని మహాత్మాగాంధీ న్యాయ కాలేజీలో 2019-20లో నకిలీ డిగ్రీ సర్టిఫికేట్‌తో అడ్మిషన్ తీసుకున్నారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, సుప్రీంకోర్టు, ఏపీ, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులకు రాసిన లేఖల్లో పేర్కొన్నారు. 
 
సాధారణంగా న్యాయ కోర్సులో చేరాలంటే డిగ్రీ లేదంటే అందుకు సమానమైన కోర్సు పూర్తి చేయాల్సి వుందని గుర్తుచేశారు. కానీ తమ్మినేని డిగ్రీ గానీ, అలాంటి మరే కోర్సుగానీ చదవలేదని అన్నారు. ఈ విషయాన్ని ఆయనే గతంలో ఓ యూట్యూబ్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్వయంగా పేర్కొన్నారని గుర్తుచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments