Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమ్మినేని సీతారాం అంత పని చేశారా? టీడీపీ నేత సంచలన ఆరోపణలు

Webdunia
మంగళవారం, 28 మార్చి 2023 (07:50 IST)
ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై టీడీపీ నేత కూన రవికుమార్ సంచలన ఆరోపణలు చేశారు. తమ్మినేని సీతారాం నకిలీ డిగ్రీ సర్టిఫికేట్‌తో లా అడ్మిషన్ తీసుకున్నారంటా ఆయన ఆరోపించారు. పైగా, తాను డిగ్రీ పూర్తి చేయలేదని గతంలో తమ్మినేని స్వయంగా చెప్పారని తెలిపారు. ఎన్నికల అఫిడవిట్‌లోనూ ఇదేవిషయాన్ని గుర్తుచేశారని, అందువల్ల ఆయనపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇదే విషయంపై రాష్ట్రపతితో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ గవర్నర్లు, ఏపీ హైకోర్టు సీజే, సీఎం జగన్‌లకు ఆయన లేఖలు రాశారు. 
 
తమ్మినేని సీతారాం స్పీకర్ అయిన తర్వాత హైదరాబాద్ ఎల్బీ నగర్‌లోని మహాత్మాగాంధీ న్యాయ కాలేజీలో 2019-20లో నకిలీ డిగ్రీ సర్టిఫికేట్‌తో అడ్మిషన్ తీసుకున్నారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, సుప్రీంకోర్టు, ఏపీ, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులకు రాసిన లేఖల్లో పేర్కొన్నారు. 
 
సాధారణంగా న్యాయ కోర్సులో చేరాలంటే డిగ్రీ లేదంటే అందుకు సమానమైన కోర్సు పూర్తి చేయాల్సి వుందని గుర్తుచేశారు. కానీ తమ్మినేని డిగ్రీ గానీ, అలాంటి మరే కోర్సుగానీ చదవలేదని అన్నారు. ఈ విషయాన్ని ఆయనే గతంలో ఓ యూట్యూబ్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్వయంగా పేర్కొన్నారని గుర్తుచేశారు. 

సంబంధిత వార్తలు

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments