Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం జగన్ హెలికాఫ్టర్‌లో ప్రయాణిస్తే.. రోడ్లపై చెట్లు నరికేస్తారా : కన్నా లక్ష్మీనారాయణ ప్రశ్న

Webdunia
ఆదివారం, 25 జూన్ 2023 (10:39 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప మాఫియా గ్యాంగ్‌ ఉమ్మడి విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో దిగి భూకబ్జాలు చేస్తోందని, ప్రశాంతమైన విశాఖను అరాచకాలు, భూకబ్జాలకు అడ్డాగా మార్చేసిందని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో శనివారం రాత్రి టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన బీసీ సదస్సులో ఆయన మాట్లాడారు. ఉత్తరాంధ్రను, ముఖ్యంగా అభివృద్ధి చెందిన విశాఖను దోచుకుతినడానికే వైకాపా మూడు రాజధానుల నాటకాన్ని తెరపైకి తెచ్చిందన్నారు. 
 
'విశాఖలో బతకలేమని సొంత పార్టీ ఎంపీలే హైదరాబాద్‌కు వెళ్తున్నారు. ఇలాంటి అరాచక పాలన చూడలేదని వైకాపా ఎమ్మెల్యేలే చెబుతున్నారు. వంద మంది రాజారెడ్డిలు కలిస్తే ఒక జగన్మోహన్‌ రెడ్డి. గతంలో కడప లోక్‌సభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ తరపున ఆ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రిగా వ్యవహరించినప్పుడే ఈ విషయం నా దృష్టికి వచ్చింది. 
 
జగన్‌ 16 నెలలు జైల్లో ఉంటే, అతడి తల్లి, చెల్లి రాష్ట్రమంతా తిరిగారు. ఇప్పుడు వారు ఎక్కడున్నారో అందరికీ తెలుసు. చెల్లిని, తల్లిని నమ్మని జగన్‌ను రాష్ట్ర ప్రజలు మాత్రం ఎందుకు నమ్మాలి?' అని కన్నా ప్రశ్నించారు. 'ముఖ్యమంత్రి ధైర్యంగా ప్రజల్లోకి రావడం లేదు. ఆయన హెలికాప్టర్‌లో వస్తుంటే నేలపై వందేళ్ల నాటి చెట్లు కొట్టేస్తున్నారు. రాష్ట్ర సంపదను గంపగుత్తగా జగన్‌ వ్యాపారం చేసుకుంటున్నారు. ప్రశ్నించే వారిపై కేసులు పెడుతున్నారు. ధన, మాన, ప్రాణాల్ని కాపాడలేని ఈ ప్రభుత్వాన్ని మళ్లీ తెచ్చుకోవద్ద'ని ప్రజలకు పిలుపునిచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments