Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెదేపాను వీడాలంటూ ఒత్తిడి.. అందుకే మా బస్సులు సీజ్ : జేసీ దివాకర్

Webdunia
గురువారం, 7 నవంబరు 2019 (12:56 IST)
తెలుగుదేశం పార్టీని విడి, వైకాపాలో చేరేలా తీవ్రమైన ఒత్తిడి చేస్తున్నారనీ, ఇందులోభాగంగా, తమ బస్సులు సీజ్ చేశారంటూ మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. 
 
ఇదే అంశంపై ఆయన గురువారం మాట్లాడుతూ, మనుషులను, సంస్థలను లక్ష్యంగా చేసుకుని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం కేసులు బనాయిస్తోందని ఆరోపించారు. అన్నివైపుల నుంచి ఒత్తిడులు పెంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేలా చేయడమే ఈ కేసుల ప్రధాన ఉద్దేశంగా ఉందన్నారు. 
 
భవిష్యత్తులో ఇది మరింత ఎక్కువ అయ్యే అవకాశం ఉందన్నారు. జేసీ ట్రావెల్స్‌కు చెందిన బస్సులు సీజ్‌ చేయడం కూడా ఇందులో భాగమేనని ఆయన చెప్పుకొచ్చారు. 
 
దశాబ్దాలుగా రవాణా వ్యాపారంలో తాను ఉన్నానని, నిబంధనలు అతిక్రమించిన సందర్భాలు ఎప్పుడూ లేవని అన్నారు. అయినా మా బస్సులు సీజ్‌ చేస్తున్నారంటే లక్ష్యం మేరకేనన్నారు. లేదంటే మిగిలిన సంస్థల బస్సులు ఎన్ని సీజ్‌ చేశారని చెప్పారు. 
 
ట్రిబ్యునల్‌ బస్సులను విడుదల చేయాలని చెప్పినా రవాణా శాఖ అధికారులు వదలడం లేదన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వంటి ఉన్నత స్థాయి అధికారిపైనే వేటు వేసిన ప్రభుత్వం తమనేం చేస్తుందో అన్న భయం అధికారుల్లో ఉందని, అందుకే వారు ఒక్క అడుగు కూడా ముందుకు వేయడం లేదన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments